CM MK Stalin : తమిళనాడు – రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం ఎంకే స్టాలిన్. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న తను పదవికి అప్రతిష్ట తీసుకు వచ్చేలా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. గవర్నర్ ప్రతిపక్షం కంటే దారుణంగా చీప్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నడని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు అటువంటి పథకాలలో దేశానికి మార్గదర్శకంగా మారిందని చెప్పారు. ఆదివారం సీఎం స్టాలిన్ (CM MK Stalin) మీడియాతో మాట్లాడారు. గవర్నర్ పదవికి రవి అనర్హుడని పేర్కొన్నారు. అధికార డిఎంకే పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వంపై అబద్ధాలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు.
CM MK Stalin Shocking Comments on Governor Ravi
మనీ లాండరింగ్ కేసులో టిఎన్ మంత్రి ఐ. పెరియసామిపై ఈడీ దాడులు ప్రకటన దేశానికి దిశానిర్దేశం చేసేది ద్రవిడ మోడల్ ప్రభుత్వం అన్నారు. కొంతమంది దుర్మార్గులు దీనిని సహించలేక పోతున్నారు ,నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన అన్నారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రతిపక్ష పార్టీలు ఏమి చెబుతున్నాయో తనకు ఆందోళన లేదని, ఎందుకంటే అది వారి రాజకీయాలు అని అన్నారు. వారి కంటే చౌకబారు రాజకీయాలు చేస్తున్న వ్యక్తి ఎవరో మీకు తెలుసు. అది కేంద్ర బిజెపి ప్రభుత్వం నియమించిన గవర్నర్ ఆర్ ఎన్ రవి. రాజ్ భవన్ నుండి ఆయన ఏమి చేస్తారో మీకు తెలుసు – డిఎంకె ప్రభుత్వంపై, డిఎంకెకు వ్యతిరేకంగా అపోహలు వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు సీఎం ఎంకే స్టాలిన్.
Also Read : Pakistan Shocking Rizwan : ఆసియా కప్ జట్టులో బాబర్, రిజ్వాన్ కు నో ఛాన్స్















