Indian Govt Strong Focus – Petrol : పెట్రోల్ రిటైల్ వ్యాపారంపై కేంద్రం కీలక మార్పులు

కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు...

Hello Telugu - Indian Govt Strong Focus - Petrol

Hello Telugu - Indian Govt Strong Focus - Petrol

Petrol : భారతదేశంలో ఇంధన విక్రయాలకు సంబంధించి నూతన మార్గదర్శకాలు త్వరలో అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ, ప్రస్తుతం ఉన్న లైసెన్సింగ్ నిబంధనలను సమీక్షించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. పెరుగుతున్న ప్రత్యామ్నాయ ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Petrol – విశ్లేషణకు ప్రత్యేక కమిటీ

ఈ కమిటీకి భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) మాజీ డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ సుఖ్మల్ జైన్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటీలో పెట్రోలియం (Petrol) ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ డైరెక్టర్ జనరల్ శ్రీ పి. మనోజ్ కుమార్, ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీస్ ఫెడరేషన్ (FIPI) సభ్యుడు శ్రీ పి.ఎస్. రవి, మంత్రిత్వ శాఖ డైరెక్టర్ (మార్కెటింగ్) శ్రీ అరుణ్ కుమార్ పాల్గొంటున్నారు.

ఈ కమిటీ బాధ్యతలు:

2019 మార్గదర్శకాల సమీక్ష

గతంలో, 2019లో ప్రభుత్వం ఇంధన విక్రయాలపై మార్గదర్శకాలను సడలించింది. అప్పటివరకు రిటైల్ లైసెన్స్ కోసం కనీస పెట్టుబడి రూ.2,000 కోట్లు అవసరం కాగా, కొత్త నిబంధనల ప్రకారం రూ.250 కోట్లు నికర విలువ గల కంపెనీలకు రిటైల్ విక్రయాలకు అనుమతినిచ్చారు. టోకు సరఫరా చేస్తూ రిటైల్ విక్రయాలకూ పాల్పడాలంటే రూ.500 కోట్లు నికర విలువ అవసరం.

ప్రస్తుత ప్రతిపాదిత మార్పులు ఈ ప్రమాణాలను మరింత సులభతరం చేసే దిశగా ఉండనున్నాయని అంచనా. ఇది కొత్త కంపెనీలకు మార్కెట్లో ప్రవేశానికి మార్గం సుగమం చేయనుంది.

దేశంలో పెట్రోల్ పంపుల గణాంకాలు

ప్రస్తుతం భారత్‌లో మొత్తం 97,804 పెట్రోల్ పంపులు ఉన్నాయి. వాటిలో:

ప్రైవేట్ రంగంలో:

ఇంకా టోటల్ ఎనర్జీస్ (అదానీ భాగస్వామ్యంతో), బిపి (రిలయన్స్‌తో), ట్రాఫిగురా, సౌదీ అరాంకో వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత మార్కెట్‌లో ఆసక్తి చూపుతున్నాయి.

మార్పుల ప్రభావం

ఈ మార్పుల ద్వారా భారత్‌లో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగానికి ఊతమిస్తూ, పెట్రోల్, డీజిల్ పంపుల ప్రాప్త్యతను పెంచే అవకాశం ఉంది. అలాగే కొత్త గ్లోబల్ మరియు దేశీయ సంస్థలకు మార్కెట్లోకి ప్రవేశం మరింత సులభమయ్యే అవకాశముంది.

మొత్తంగా, ఈ మార్పులు దేశీయ ఇంధన రంగాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దేందుకు కీలకంగా నిలవనున్నాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : Minister Ashwini Vaishnaw – India Growth : భారత్ వృధ్దిరేటుపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

Exit mobile version