బండి సంజ‌య్.. ఖ‌ర్మ ఎవ‌రినీ వ‌దిలి పెట్ట‌దు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్ ఫైర్

helloteugu-MLCDesipathiSrinivaas

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశిప‌తి శ్రీ‌నివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ ను ఏకి పారేశారు. ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ ‘ఫామ్‌హౌస్, ఫామ్‌హౌస్’ అంటూ నిరంతరం కేసీఆర్‌పై విచ్చలవిడిగా దాడి చేశాడని అన్నారు. కేవలం చిన్నగా ఉందన్న కారణంతో కేసీఆర్ నంది నగర్ ఇంటిని తప్పుగా చిత్రీకరిస్తూ, అక్కడ నివసిస్తున్నందుకు కేసీఆర్‌ను చెడ్డవాడిగా చూపించడానికి ప్రయత్నిస్తూ, దానిపై అతను అసహ్యకరమైన దాడి చేశాడని ఆవేద‌న చెందారు. ఈరోజు ఏమైంది? మీ ఫామ్‌హౌస్‌లో జరిగిన నాటకం వెలుగులోకి వచ్చిందన‌న్నారు. అదే ఫామ్‌హౌస్ ఇప్పుడు మీ సొంత కుటుంబాన్నే వెంటాడుతోందని, అందుకే ఖ‌ర్మ ఫ‌లం నుంచి ఎవ‌రూ త‌ప్పించు కోలేర‌ని అన్నారు దేశిప‌తి శ్రీ‌నివాస్.

కేటీఆర్ ఒక విద్యావంతుడు, హేతువాది, ప్రజల పట్ల నిజమైన కరుణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ‘డ్రగ్స్, డ్రగ్స్’ అంటూ నీచమైన దుష్ప్రచారం చేశారని , ఈరోజు అసలు ఎవరి డ్రగ్స్ బయట పడ్డాయి? ఎవరి కేసుల్లో డ్రగ్స్ ప్రమేయం ఉందో ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని అన్నారు. చివరగా, అతను ‘పుట్టుమచ్చల’ గురించి మాట్లాడాడు. అంతకంటే అసహ్యకరమైన చర్చ మరొకటి ఉండదన్నాడు. హిందూ సంస్కృతికి ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పుకునే వ్యక్తులు మహిళలను కించపరిచి, వారి ఆత్మగౌరవాన్ని కాలరాసి, పుట్టుమచ్చల గురించి మాట్లాడడం దారుణ‌మ‌న్నారు. చివరికి అతనికి ఏమైంది? తన కొడుకు విషయంలో, తండ్రిగా నా పేరు వాడకూడదని ఆయన ఒక ఉత్తర్వు తెప్పించుకునే దౌర్భాగ్య స్థ‌తికి చేరుకున్నాడ‌ని అన్నారు. ఖ‌ర్మ ఎవ‌రినీ ఊరికే వ‌దిలి పెట్ట‌ద‌న్నారు.

Exit mobile version