BCCI : ముంబై : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక ప్రకటన చేసింది. భారత క్రికెట్ జట్టు జెర్సీకి సంబంధించిన స్పాన్సరర్స్ ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈమేరకు శనివారం అధికారికంగా బీసీసీఐ స్పాన్సరర్స్ ఎవరనే దానిపై త్వరలోనే తేలుతుందని వెల్లడించింది. టీమ్ ఇండియా జెర్సీ స్పాన్సర్లను 15 లేదా 20 రోజుల్లో ఖరారు చేస్తామని బీసీసీఐ (BCCI) వైస్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత టీమ్ ఇండియాకు ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్లో షర్ట్ స్పాన్సర్ లేదు. దీని విలువ సంవత్సరానికి రూ. 358 కోట్లు.
BCCI Key Updates
ఇదిలా ఉండగా భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్ను రాబోయే రెండు మూడు వారాల్లో ఖరారు చేస్తామని, బిడ్లు సెప్టెంబర్ 16న ముగుస్తాయని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా శనివారం తెలిపారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్ 11 తో బీసీసీఐ ఒప్పందం సంవత్సరానికి రూ. 358 కోట్ల విలువైన ఆన్లైన్ గేమింగ్ బిల్లు అమలులోకి వచ్చిన తర్వాత టీమ్ ఇండియాకు షర్ట్ స్పాన్సర్ లేదు.
కేంద్రం ఆన్ లైన్ గేమ్స్ పై నిషేధం విధించింది. దీంతో తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది డ్రీమ్ 11 సంస్థ. రియల్-మనీ గేమింగ్, బెట్టింగ్, క్రిప్టోకరెన్సీ లేదా ఆల్కహాలిక్ ఉత్పత్తులలో పాల్గొన్న కంపెనీలను బిడ్డింగ్ నుండి నిషేధించింది. ఇందులో భాగంగా కొత్త టెండర్ను విడుదల చేసింది. ఇప్పటికే స్పాన్సర్ షిప్ కోసం చాలా సంస్థలు బిడ్ లు దాఖలు చేశాయన్నారు. ఇంకా ఖరారు చేయలేదన్నారు.
Also Read : Myanmar Air Strike Sensational : మయన్మార్లో జుంటా వైమానిక దాడి – 19 మంది విద్యార్థుల మృతి
