Reliance : భారతీయ పారిశ్రమిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ ఖుష్ కబర్ చెప్పింది. ఏపీలో భారీ ఎత్తున పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఏపీ ప్రభుత్వం కంపెనీ ఏర్పాటుకు 80 ఎకరాలు కేటాయించింది. రూ. 30 లక్షలు ఎకరం చొప్పున వీటిని విక్రయించినట్లు స్పష్టం చేసింది ఏపీ సర్కార్. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Reliance Industries New Investments
ఇదిలా ఉండగా రిలయన్స్ (Reliance) సంస్థ కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో రూ. 1622 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో ఓర్వకల్లుకు మహర్దశ పట్టనుంది. ఈ కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా జాబ్స్ దొరుకతాయని తెలిపింది రిలయన్స్ సంస్థ. వచ్చే ఏడాది డిసెంబర్ లోకా ఉత్పత్తిని ప్రారంభించాలని సర్కార్ ఆదేశించింది.
ప్రస్తుతం కూటమి పాలనలో అమరావతి రాజధాని పనులు వేగవంతం అయ్యాయి. ఇప్పటికే పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ కేబినెత్ కీలక తీర్మానం చేసింది. వివిధ పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రిలయన్స్ కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేయబోయే కంపెనీతో భారీ ఎత్తున జాబ్స్ లభించే ఛాన్స్ ఉంది. దీని వల్ల రాయలసీమ ప్రాంత అభివృద్దికి ఊతం ఇచ్చినట్లవుతుంది. ఇందులో శీతల పానియాలు, జ్యూస్ లు, డ్రింకింగ్ వాటర్ తయారీ పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించింది. ఇప్పుడు భూములు కేటాయించింది సర్కార్. ప్రత్యక్షంగా 1200 మందికి పరోక్షంగా 3 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
Also Read : CM Chandrababu Shocking Decision :మాదక ద్రవ్యాలు విక్రయిస్తే ఆస్తులు జప్తు
