Maharashtra : భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదేశాల మేరకు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్ మహారాష్ట్ర గవర్నర్ అదనపు బాధ్యతలు స్వీకరించనున్నారు. మహారాష్ట్ర గవర్నర్ సి.పి. రాధాకృష్ణన్ దేశ ఉపరాష్ట్రపతిగా ఎన్నికై గురువారం (సెప్టెంబర్ 11, 2025) తన పదవికి రాజీనామా చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది.
Maharashtra – ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విజయం
67 ఏళ్ల రాధాకృష్ణన్, ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేసి, సంయుక్త ప్రతిపక్ష అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జూలై 21న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ ఆకస్మిక రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు నిర్వహించబడ్డాయి.
తాత్కాలిక బాధ్యతలు
“భారత ఉపరాష్ట్రపతిగా సి.పి. రాధాకృష్ణన్ ఎన్నిక కావడంతో మహారాష్ట్ర గవర్నర్ పదవిని వదిలారు. ఈ నేపథ్యంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్వ్రత్కు మహారాష్ట్ర గవర్నర్ బాధ్యతలను అదనంగా అప్పగిస్తున్నాము” అని రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
Also Read : Honda Huge Price Reduction : హోండా బైక్ ధరలకు భారీ తగ్గింపు – జీఎస్టీ ప్రయోజనం

















