UPI : డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలో ముందుండటమే కాదు, వాటిని మరింత సురక్షితంగా, సులభంగా మార్చేందుకు భారత ప్రభుత్వం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో యూపీఐ చెల్లింపులకు సంబంధించి మరో కీలక ఫీచర్ను ప్రవేశపెట్టేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) సిద్ధమవుతోంది.
ఇప్పటివరకు యూపీఐ చెల్లింపుల కోసం 4 లేదా 6 అంకెల పిన్ అవసరం కాగా, త్వరలోనే పిన్ లేకుండానే చెల్లింపులు చేయే అవకాశం అందుబాటులోకి రానుంది. కొత్తగా అభివృద్ధి చేస్తున్న బయోమెట్రిక్ ఆధారిత ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వేలిముద్ర, ముఖ గుర్తింపు (Face ID) లేదా కంటిపాప (Iris) గుర్తింపుతో చెల్లింపులు పూర్తి చేయగలుగుతారు.
UPI – ఎలా పని చేస్తుంది కొత్త విధానం?
యూజర్ QR కోడ్ స్కాన్ చేసిన తర్వాత పిన్ నమోదు చేసే బదులు, మొబైల్లోనే జత చేయబడిన బయోమెట్రిక్ గుర్తింపు ద్వారా చెల్లింపును ధృవీకరించవచ్చు. ఇది మరింత సురక్షితంగా ఉండటంతో పాటు, పెద్దవారు, సాంకేతిక పరిజ్ఞానం లేనివారు కూడా సులభంగా వినియోగించగలుగుతారు.
ఎందుకు అవసరమైంది ఈ మార్పు?
- పిన్ను గుర్తుంచుకోవడం చాలామందికి కష్టంగా మారింది
- పిన్ లీక్ అయినా మోసపూరిత లావాదేవీలు జరుగుతున్నాయి
- వృద్ధులు, గ్రామీణ ప్రాంతాలవారు టెక్నాలజీ ఉపయోగంలో ఇబ్బందులు పడుతున్నారు
ఈ కారణాలన్నిటికీ పరిష్కారంగా NPCI బయోమెట్రిక్ ఆధారిత మెకానిజాన్ని తీసుకొస్తోంది. ఇది ఇప్పటికే అభివృద్ధి దశలో ఉండగా, పరిశీలన అనంతరం కొద్ది నెలల్లో దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
పాత విధానాలూ కొనసాగుతాయి:
కొత్త ఫీచర్ వచ్చినా, పిన్, ఫేస్ ఐడీ వంటి మునుపటి ఆప్షన్లు కూడా అందుబాటులో ఉంటాయి. యూజర్కు నచ్చిన భద్రతా విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంటుంది.
మారుతున్న భారత్ – మలుపులు తీస్తున్న టెక్నాలజీ:
ఈ కొత్త ఫీచర్ వల్ల భారత్ డిజిటల్ చెల్లింపుల రంగంలో మరింత ముందుకు వెళ్ళనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల దృష్టిని ఆకర్షించడంలో ఇది సహాయపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : Mukesh Ambani Growth : ఆయుర్వేద రంగంలో కూడా కొత్త బ్రాండ్ తో వస్తున్న అంబానీ


















