Yuvraj Singh : ఢిల్లీ : ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ కేసుకు సంబంధించి ప్రముఖ భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvraj Singh) మంగళవారం ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ) ముందు విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేసిందని ఈడీ ఇవాళ వెల్లడించింది. ఐఎక్స్ బెట్ అనే ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ తో మనీ లాండరింగ్ చోటు చేసుకుందని పేర్కొంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెంట్రల్ ఢిల్లీ లోని ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్నారు. ఏజెన్సీ ఆల్ రౌండర్, ఎడమచేతి వాటం బ్యాటర్ను ప్రశ్నించి, మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద తన వాంగ్మూలాన్ని నమోదు చేసింది.
Yuvraj Singh – ED Shocking for Betting Apps Promotion Case
ఇదిలా ఉండగా ఈ దర్యాప్తులో భాగంగా గత కొన్ని వారాలుగా మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ , రాబిన్ ఉతప్పలతో పాటు టిఎంసి మాజీ ఎంపి, నటుడు మిమి చక్రవర్తి , బెంగాలీ నటుడు అంకుష్ హజ్రాను ఫెడరల్ దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. ఇదే కేసులో నటుడు సోను సూద్కు బుధవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సమన్లు జారీ చేసింది 1xBet బెట్టింగ్ యాప్ కార్యకలాపాలపై దర్యాప్తు అనేక మందిని కోట్లాది రూపాయల మోసం చేసి, భారీ మొత్తంలో ప్రత్యక్ష, పరోక్ష పన్నులను ఎగవేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. కురాకో-రిజిస్టర్డ్ ప్రకారం, బెట్టింగ్ పరిశ్రమలో 18 సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ దర్యాప్తులో భాగంగా రాబోయే రోజుల్లో మరికొందరు క్రీడాకారులు, సినీ నటులు, ఆన్లైన్ ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలను ఏజెన్సీ ప్రశ్నించే అవకాశం ఉంది.
Also Read : Rahul Gandhi Shocking Allegations : నిరుద్యోగం ఓటు చోరీతో ప్రత్యక్ష సంబంధం

















