హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రం నుంచి 100 స్టార్టప్ ల కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించనున్నట్లు తీపి కబురు చెప్పారు. బుధవారం హైదరాబాద్లోని టీ-హబ్లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ (జీఐఎస్) హబ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ప్రభుత్వం త్వరలో స్టార్టప్ నిధిని ప్రారంభిస్తుందని చెప్పారు. ఇందు కోసం ఏకంగా భారీ ఎత్తున నిధులను సమకూరుస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఈ స్టార్టప్ ఫండ్ కోసం ప్రత్యేకంగా రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. ఆంట్రప్రెన్యూర్స్, అంకురాల కోసం ప్రయత్నం చేస్తున్న వారంతా ఈ నిధుల నిధిని ఉపయోగించు కోవాలని ముఖ్యమంత్రి స్టార్టప్ ఫౌండర్స్ కు విన్నవించారు.
1998లో గూగుల్ వినయ పూర్వకమైన ప్రారంభాలను ప్రస్తావించారు. 2034 నాటికి హైదరాబాద్ నుండి కనీసం 100 స్టార్టప్లు యునికార్న్లుగా మారుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో శక్తివంతమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి గూగుల్ అంకితం కావడం పట్ల అభినందించారు.హైదరాబాద్లోని గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ భారతదేశంలోనే మొట్ట మొదటి హబ్ కావడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. తన చేతుల మీదుగా స్టార్ట్ చేయడం మరిచి పోలేని అనుభవంగా మిగిలి పోతుందన్నారు. ఇదిలా ఉండగా గూగుల్ తెలంగాణ నుండి ప్రాంతీయ స్టార్టప్లను హబ్ ద్వారా నిమగ్నం చేయాలని యోచిస్తోంది, ఎంపిక చేసిన AI-ఫస్ట్ స్టార్టప్లకు ఉచిత, ఏడాది పొడవునా అంకితమైన కోవర్కింగ్ సీట్లు, వెంచర్ ఇన్వెస్టర్ల క్యూరేటెడ్ సెట్తో సహా. హైదరాబాద్ స్టార్టప్లకే కాకుండా యూనికార్న్ల హబ్గా కూడా మారాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు చెప్పారు.
