Vijayawada Police : విజయవాడ : విజయవాడ నగర శివార్లలో ఇటీవల వేర్వేరు ప్రాంతాల్లో అరెస్టు చేసిన మావోయిస్టుల (నక్సలైట్ల) ను విచారణ నిమిత్తం తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు (Vijayawada Police) న్యాయస్థానాలను ఆశ్రయించారు. నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు వారిని కస్టడీలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు వేర్వేరు కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
Vijayawada Police Sensational
విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో ఈ నెల 18న నలుగురు మావోయిస్టులు పొడియా బీమా (రంగు), మడకం లక్మ (మదన్), మడవి చిన్మయి (మనీలా), మంగి డొక్కుపాడిలను పోలీసులు అరెస్టు చేసిన సంగతి విదితమే. ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్న వీరిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పటమట పోలీసులు నాలుగో అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశారు.
అదేవిధంగా, కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరులోని కొత్త ఆటోనగర్లో పట్టుబడిన 28 మంది మావోయిస్టుల్లో ముగ్గురిని కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఉద్దే రఘు, ఓయం జ్యోతి, మడకం దివాకర్లను మూడు రోజుల కస్టడీకి అనుమతించాలని కోరుతూ పటమట పోలీసులు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై న్యాయస్థానాల నిర్ణయం వెలువడాల్సి ఉంది.
Also Read : Minister TG Bharat Huge Donation : ఉర్దూ యూనివర్శిటీకి మంత్రి భరత్ భారీ విరాళం


















