Vijay Deverakonda : మరోసారి చర్చనీయాంశంగా మారారు నటీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. ఈ ఇద్దరూ అమెరికా రాజధాని న్యూయార్క్ లో తళుక్కున మెరిసారు. తాజాగా ఈ నగరం వేదికగా జరిగిన 43వ ఇండియా డే పరేడ్కు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న నాయకత్వం వహించారు. ఆగస్టు 17న జరిగిన ఈ కార్యక్రమానికి వీరిద్దరూ రంగుల కలయికతో కూడిన సాంప్రదాయ దుస్తులను ధరించారు. డేటింగ్ పుకార్ల మధ్య చాలా కాలం తర్వాత వారు కలిసి కనిపించడం ఇదే మొదటిసారి. ఈ కార్యక్రమంలో, గీతా గోవిందం జంట నవ్వుతూ చేతులు పట్టుకుని హాజరైన వారిని పలకరించడం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.
Vijay Deverakonda-Rashmika Mandanna Viral
డియర్ కామ్రేడ్ జంట డేటింగ్ చేస్తున్నారని గత కొంత కాలం నుంచి పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ ఇద్దరు కలిసి తొలుత డియర్ కామ్రెడ్ లో కనిపించారు. ఆ తర్వాత పరుశురామ్ తీసిన గీత గోవిందమ్ లో కీ రోల్స్ పోషించారు. ఈ సినిమా తెలుగునాట సక్సెస్ మోత మోగించింది. కాసుల వర్షం కురిపించింది. ఆనాటి నుంచి నేటి దాకా తమ సంబంధాన్ని ఎప్పుడూ బహిరంగంగా ధృవీకరించనప్పటికీ తరచుగా విందులో లేదా విమానాశ్రయాలలో కలిసి కనిపించారు.
ఇటీవలి ఇంటర్వ్యూలలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా తాము ఇకపై ఒంటరిగా లేమని విడిగా ధృవీకరించారు కూడా. కెరీర్ విషయంలో విజయ్ దేవరకొండ చివరిసారిగా కింగ్డమ్లో కనిపించారు, ఇది బాక్సాఫీస్ వద్ద మంచి ప్రదర్శన ఇచ్చింది. ధనుష్ కూడా నటించిన రష్మిక మందన్న నటించిన కుబేరా సూపర్ హిట్ గా నిలిచింది. రష్మిక మందన్నాకు ఈ ఏడాది సూపర్ హిట్ సినిమాలు దక్కడం విశేషం.
Also Read : Popular CP Radha Krishnan History : ఎవరీ సీపీ రాధాకృష్ణన్..?


















