Modi: అమెరికా : వాణిజ్యం, వ్యాపార నిర్వహణకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో (Modi) ఫోన్ లో మాట్లాడారు. ప్రధానంగా వ్యాపార పరంగా చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్ వెల్లడించారు. ఓవల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు దేశాధ్యక్షుడు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో తాను మాట్లాడానని, సంభాషణ ఎక్కువగా వాణిజ్యంపై దృష్టి పెట్టిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాము చాలా విషయాల గురించి ఫోకస్ పెట్టామన్నారు. ప్రధానంగా తామిద్దరి మధ్య వాణిజ్య ప్రపంచం గురించి మాట్లాడామన్నారు.
Modi-Trump Trade Discussion
ఇదే సమయంలో రష్యా నుండి భారతదేశం తన చమురు కొనుగోళ్లను పరిమితం చేస్తుందని మోడీ తనకు హామీ ఇచ్చారని చెప్పారు ట్రంప్ . ఇంధనం కూడా చర్చలో భాగమని జోడించారు. రష్యా నుండి ఎక్కువగా చమురును కొనుగోలు చేయబోమంటూ హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రష్యా సముద్రతీర ముడి ఎగుమతులలో భారతదేశం, చైనా రెండు అగ్ర కొనుగోలుదారులుగా ఉన్నారు. రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ట్రంప్ ఇటీవల భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఉక్రెయిన్లో శాంతి ఒప్పందంపై చర్చలు జరపాలని మాస్కోపై ఒత్తిడి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నందున, ఆ దేశం ముడి చమురు కొనుగోళ్లను నిరుత్సాహ పరిచేందుకు అమెరికాకు భారత ఎగుమతులపై సుంకాలను విధించారు.
Also Read : Huge Nominations for Jubilee Hills By Election : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు భారీగా నామినేషన్లు


















