కేరళ : ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా ఎటువంటి విద్యుత్ అంతరాయం ఉండదని రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరాయ విద్యుత్ సరఫరాను నిర్ధారించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని కేరళ విద్యుత్ శాఖ మంత్రి సన్నీ జోసెఫ్ హామీ ఇచ్చారు. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరిగే ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ భారతదేశంలో భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12.30 గంటల నుండి ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మ్యాచ్ అంతటా నిరంతరాయ విద్యుత్ సరఫరాను కొనసాగించాలని కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు కి ప్రత్యేక సూచనలు జారీ చేసినట్లు జోసెఫ్ తెలిపారు. ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా సోమవారం పాఠశాలలకు సెలవు ప్రకటించింది కేరళ. ప్రజలు మ్యాచ్ చూడాలని మేము కోరుకుంటున్నాం. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అదనపు రుసుము చెల్లించి అయినా, ఈ రోజు పగలు, రాత్రి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ఆదేశించామన్నారు.
కాగా గణనీయమైన వర్షపాతం కొరత కారణంగా కేరళ సవాలుతో కూడిన విద్యుత్ పరిస్థితిని ఎదుర్కొంటోందని జోసెఫ్ అన్నారు. దీనివల్ల జలవిద్యుత్ రిజర్వాయర్లలో నీటి లభ్యత తగ్గడంతో పాటు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరిగింది. అర్జెంటీనా – స్పెయిన్ ఫీఫా ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా కేరళ మంత్రికి సెలవు కోసం అభ్యర్థనలు భారీగా వచ్చాయి. సౌర విద్యుత్ ఉత్పత్తి పగటిపూట మాత్రమే అందుబాటులో ఉండటం , కేరళలో తగినంత విద్యుత్ నిల్వ సౌకర్యాలు లేకపోవడంతో, ముఖ్యంగా రాత్రిపూట వినియోగం కోసం, రాష్ట్రం ఇప్పుడు మార్కెట్ నుండి ఖరీదైన విద్యుత్ను కొనుగోలు చేయవలసి వస్తోందని జోసెఫ్ అన్నారు.


















