చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు, సినీ రంగం కలిసే ఉంటాయి. త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ప్రముఖ నటుడు తలపతి విజయ్. తాను ఇక నుంచి సినిమాలు చేయనంటూ ప్రకటించాడు. అందరినీ విస్తు పోయేలా చేశాడు. ఏకంగా అందరి అంచనాలు తలకిందులు చేస్తూ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశాడు. దాని పేరు టీవీకే. సినీ రంగంలో ఇప్పటి వరకు టాప్ స్టార్ గా ఉన్నాడు. కోట్లాది రూపాయలు సంపాదించాడు. తన బ్రాండ్ కు వందల కోట్లు ఉంటుంది. ఈ తరుణంలో తాను నటిస్తున్న చివరి చిత్రం జన నాయగన్ అని స్పష్టం చేశాడు. ఇందుకు సంబంధించి ఈనెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా జన నాయగన్ విజయ్ కు తనది చివరి చిత్రం కాదని పేర్కొన్నారు ప్రముఖ జ్యోతిష్కుడు ప్రశాంత్ కిని.
తాజాగా తాను చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సదరు నటుడు 2028–29లో తిరిగి సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని నటుడు తలపతి విజయ్కి విజయవంతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుందని జోస్యం చెప్పారు, ఈ తమిళ సూపర్స్టార్ 2031లో తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. జ్యోతిష్యుడి ప్రకారం, విజయ్ రాబోయే చిత్రం జన నాయగన్ తెరపై అతని చివరి చిత్రం కాదు. అతను 2028–29 మధ్య మళ్లీ నటిస్తారని, ప్రధాన హీరోగా అతని చివరి చిత్రం 2029లో విడుదల కానుందని అంచనా వేశారు. విజయ్ తన సినిమా ప్రయాణాన్ని , పెరుగుతున్న రాజకీయ ఆకాంక్షలను సమతుల్యం చేసుకుంటున్న తరుణంలో, ఈ జోస్యం అభిమానులు , రాజకీయ పరిశీలకుల మధ్య చర్చలకు దారితీసింది.



















