Semiconductors : విజయవాడ : విఐటీ – ఏపి విశ్వవిద్యాలయంలో నేషనల్ సెమీకండక్టర్ (Semiconductors) టెక్నాలజీ సింపోజియం (NSTS) 2025 ఘనంగా ప్రారంభమైంది. ఈ సింపోజియం 13 తేదీ వరకు జరగనుంది. ఈ మూడు రోజుల సింపోజియంను విఐటి-ఏపి విశ్వవిద్యాలయం, ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ (ANRF), VVDN Technologies, IEEE VIT-AP స్టూడెంట్ బ్రాంచ్ మరియు మైక్రోవేవ్ థియరీ అండ్ టెక్నిక్స్ సొసైటీ (MTT-S) మద్దతు ఇస్తున్నాయి. స్వదేశీ ఆవిష్కరణ, నైపుణ్య అభివృద్ధి, పరిశ్రమ-విద్యా సహకారంపై దృష్టి సారించడం ద్వారా భారతదేశం సెమీ కండక్టర్ ప్రస్థానాన్ని ముందుకు తీసుకువెళ్లడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. NSTS 2025 విద్యా, పరిశ్రమ, ప్రభుత్వం నుండి ఆలోచనలు కలిగిన నాయకులను సమావేశపరిచి సెమీ కండక్టర్ రంగంలో పరివర్తన అవకాశాలను మెరుగు పరచటమే ఈ సింపోసియం లక్ష్యం.
Semiconductors Technology Updates
ఈ సింపోజియం “భారత-కేంద్రీకృత ఆవిష్కరణల ద్వారా సెమీకండక్టర్ సరిహద్దులను ఉపయోగించడం” అనే థీమ్ కింద అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాలను అన్వేషించడానికి, వ్యూహాత్మక భాగస్వామ్యాలను పెంపొందించడానికి, భారతదేశ-కేంద్రీకృత ఆవిష్కరణలను ప్రదర్శించడానికి ఒక వేదికగా పని చేస్తుంది.
ఈ సింపోజియం లో 400+ మంది ప్రతినిధులు, ప్రముఖ ప్రపంచ, జాతీయ కంపెనీల నుండి 20 మందికి పైగా పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇందులో AMD, Altera, Ansys, ARM, BEL, CII, Cyient సెమీకండక్టర్స్, GSAS, HCL టెక్నాలజీస్, క్యోసాన్, ITAAP, మైక్రోచిప్, NXP, PTC, ఫిలిప్స్, STARC, సిమెన్స్, సిలికాన్ ల్యాబ్స్, సిలికాన్ సిస్టమ్స్, WnP టెక్నాలజీస్ ఉన్నాయి. ఐది అమరావతి ప్రాంతంలో జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం కావడం విశేషం.
Also Read : CM Chandrababu Interesting Comments : ప్రాజెక్టుల కోసం ఎన్ని నిధులైనా ఇస్తాం


















