Saif Ali Khan : బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కు బిగ్ షాక్ తగిలింది. రూ. 15000 కోట్ల విలువ చేసే ఆస్తులు మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ఉన్నాయి. గతంలో 2000వ సంవత్సరంలో నటుడి కుటుంబానికి అనుకూలంగా కోర్టు తీర్పు చెప్పింది. ఆ ఆస్తులన్నీ సైఫ్ అలీ (Saif Ali Khan) ఫ్యామిలీకే చెందినవంటూ. దీనిపై తాజాగా విచారణ చేపట్టింది మధ్యప్రదేశ్ హైకోర్టు. ఈ సందర్బంగా సంచలన తీర్పు వెలువరించింది. దీనిపై తిరిగి విచారణ చేపట్టాలని ఆదేశించింది. చట్ట పరమైన లోపాలను ఈ సందర్బంగా ఉదహరించింది. ఏడాది పాటు గడువు విధించింది.
Saif Ali Khan Shocking Case
ఇదిలా ఉండగా భోపాల్ పూర్వ పాలకుల యాజమాన్యంలోని ఆస్తులు సైఫ్ (Saif Ali Khan) కుటుంబానికి వారసత్వంగా సంక్రమించాయి. వీటి విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం రూ. 15 వేల కోట్లకు పైగానే . కాగా రెండు దశాబ్దాల కిందట ఇచ్చిన ట్రయల్ కోర్టు తీర్పును పక్కన పెట్టింది. దీనిపై అనుమానాలు ఉన్నాయని వ్యక్తం చేయడం గమనార్హం.
ఈ కేసుకు సంబంధించి జూన్ 30న జారీ చేసిన తన ఉత్తర్వులో జస్టిస్ సంజయ్ ద్వివేది హైకోర్టు సింగిల్ బెంచ్ పటౌడిస్ (సైఫ్ అలీ ఖాన్, అతని తల్లి షర్మిలా ఠాగూర్, ఇద్దరు సోదరీమణులు సోహా, సబా) ఆస్తుల యజమానులుగా ఉండటాన్ని సమర్థిస్తూ ట్రయల్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇచ్చిన డిక్రీని తాజాగా కోర్టు రద్దు చేసింది. ఒక సంవత్సరంలోపు ముగించి నిర్ణయించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. నవాబ్ హమీదుల్లా భోపాల్ రాచరిక రాష్ట్రానికి చివరి పాలక నవాబ్. ఆయనకు, ఆయన భార్య మైమూనా సుల్తాన్కు ముగ్గురు కుమార్తెలు. అబిదా, సాజిదా, రబియా. సాజిదా ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీని వివాహం చేసుకుని భోపాల్ నవాబ్ బేగం అయ్యారు.
వారి కుమారుడు భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షర్మిలా ఠాగూర్ను వివాహం చేసుకున్న మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ. నవాబ్ హమీదుల్లా పెద్ద కుమార్తె అబిదా పాకిస్తాన్కు వలస వెళ్ళిన తర్వాత, సాజిదా ఆస్తులకు యజమాని అయ్యారు. తరువాత, ఆమె కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ (షర్మిలా ఠాగూర్ను వివాహం చేసుకున్న టైగర్ పటౌడీ) దాదాపు రూ. 15,000 కోట్ల విలువైన ఈ ఆస్తులకు వారసుడు అయ్యాడు. ఇవి సైఫ్ అలీ, అతని తోబుట్టువులకు వారసత్వంగా వచ్చాయి.
Also Read : Beauty Eesha Rebba Movie : ఈషా రెబ్బా ఓం శాంతి శాంతి శాంతిహి
