Ramayana : పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘రామాయణ’ (Ramayana) తాజాగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోతో మరింత అంచనాలు పెంచుకుంది. బాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో, రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా కనిపించనుండడం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని కలిగిస్తోంది.
Ramayana Movie Glimpse Released
ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగాన్ని 2027లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా విడుదలైన వీడియోలో, త్రిమూర్తుల ఆధ్యాత్మిక తత్వం, రామ-రావణ యుద్ధానికి సంబంధించిన నేపథ్యం ఎంతో గ్రాండ్గా చూపించబడింది. వీఎఫ్ఎక్స్, బీజీఎమ్, పాత్రల లుక్స్ అన్నీ ఆసక్తికరంగా ఉన్నాయి. వీడియోలో వినిపించిన మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి:
“ధర్మానికి ప్రతీక రాముడు… శక్తికి చిహ్నం రావణుడు…
ఇది అమర గాథ… ఇది రామాయణం…”
పాత్రల వివరాలు:
రణబీర్ కపూర్ – శ్రీరాముడు
సాయి పల్లవి – సీత
యష్ – రావణుడు
సన్నీ డియోల్ – హనుమంతుడు
రవి దుబే – లక్ష్మణుడు
ఇంకా విశేషం ఏమంటే… ఈ సినిమాకు సంగీతాన్ని ఏఆర్ రెహమాన్ మరియు హాన్స్ జిమ్మర్ కలిసి అందిస్తున్నారు. రచయితగా శ్రీధర్ రాఘవన్, దర్శకుడిగా నితేష్ తివారీ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ గ్లింప్స్తో సినిమా మీద ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక గొప్ప విజువల్ ఎక్స్పీరియన్స్గా ఈ చిత్రం నిలిచే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ దీపావళికి రామాయణం ప్రారంభం… 2026లో గ్రాండ్ రిలీజ్కు సిద్ధం!
Also Read : Hero Balakrishna-Akhanda 2 : బాలయ్య అఖండ-2లో హర్షాలీ మల్హోత్రా

















