Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ క్రేజ్ ఎంత చెప్పినా తక్కువే. అభిమానుల ఆరాధనను మరోసారి నిరూపిస్తూ, మధురైకి చెందిన కార్తీక్ అనే అభిమాని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. తలైవా కోసం కొన్నేళ్ల క్రితం నిర్మించిన చిన్న గుడిలో ఈసారి నవరాత్రి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేశాడు.
Rajinikanth – 230 విగ్రహాలతో బొమ్మల కొలువు
కార్తీక్ నిర్మించిన రజినీ గుడిలో ప్రస్తుతం 230 ప్రతిమలు ఉన్నాయి. వాటిని 15 వరుసల్లో అమర్చాడు. వీటిలో 10 వరుసల్లో రజినీకాంత్ (Rajinikanth) ఫొటోలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి.
నిత్యపూజలు, హారతులు
నవరాత్రి తొలిరోజు నుంచి కార్తీక్ ప్రతీ రోజూ ప్రతిమలకు, ఫొటోలకి ప్రత్యేక పూజలు, హారతులు ఇస్తున్నాడు. రజినీకాంత్ విగ్రహానికి నిత్యం పూజలు చేస్తూ ఆరాధన కొనసాగిస్తున్నాడు.
సోషల్ మీడియాలో వైరల్
ఈ ప్రత్యేక బొమ్మల కొలువుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రజినీ విగ్రహం, ఫొటోలకి కార్తీక్ హారతి ఇస్తున్న దృశ్యాలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
అభిమానుల ప్రశంసలు
ఈ వీడియోపై నెటిజన్లు “తలైవా అభిమానానికి ఇది నిదర్శనం”, “గ్రేట్ ఫ్యాన్” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. రజినీ కోసం ఆలయం నిర్మించడం, బొమ్మల కొలువు ఏర్పాటు చేయడం కార్తీక్ భక్తి, అభిమానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read : TTD Interesting Updates : కలియుగ వైకుంఠం శేషాచలం – చరిత్ర, ఆధ్యాత్మిక వారసత్వం

















