PM Narendra Modi-Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలాన్ని పరిశీలంచనున్న ప్రధాని

అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు...

Hello Telugu - PM Narendra Modi

Hello Telugu - PM Narendra Modi

Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం అహ్మదాబాద్‌ పర్యటనకు వెళ్లనున్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాద స్థలాన్ని సందర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా మరియు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అహ్మదాబాద్‌లో ఉండి, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

PM Narendra Modi Will Visit

ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రమాద సమయంలో విమానంలో 230 మంది ప్రయాణీకులు మరియు 12 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 11 మంది చిన్నారులు, ఇద్దరు శిశువులు ఉన్నారు.

ప్రధానమంత్రి మోదీ (Narendra Modi) పర్యటనలో ఆయన వెంట పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌లు కూడా ఉన్నారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలను వేగవంతంగా చేపడుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఘటనా ప్రాంతంలో గట్టి భద్రత ఏర్పాటైంది.

కుప్పకూలిన విమానం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 ఫ్లైట్‌గా గుర్తించబడింది. ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్‌కు బయలుదేరింది. కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కుప్పకూలడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మమ్మల్ని తీవ్రంగా కలిచివేసింది. ఇది మాటల్లో చెప్పలేని విషాద ఘటన. ఈ సమయంలో నేను ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాను. బాధితులకు సహాయం అందించేందుకు మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Also Read :  Kantara 2 Shocking: రోజు రోజుకి వెనక్కి వెళ్తున్న ‘కాంతార 2’..మరో ఆర్టిస్ట్ దుర్మరణం

Exit mobile version