Modi : ఢిల్లీ – భారతదేశం 2030 కామన్ వెల్త్ గేమ్స్ (సీడబ్ల్యూజీ) బిడ్ను క్యాబినెట్ ఆమోదించింది . ఈ కార్యక్రమానికి బిడ్ను సమర్పించడానికి ఆగస్టు 31 చివరి తేదీ . దీంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ రాబోయే 48 గంటల్లో ఈ ప్రక్రియను పూర్తి చేస్తుందని భావిస్తున్నారు. ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించిన తర్వాత భారత ఒలింపిక్ సంఘం ఈ చర్యకు ఆమోదం తెలిపిన కొన్ని రోజుల తర్వాత ఈ నిర్ణయం వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Modi) నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారతదేశం బిడ్ను ఆమోదించింది.
PM Modi Cabinet Approved
దాని ప్రపంచ స్థాయి స్టేడియంలు, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలు, ఉద్వేగ భరితమైన క్రీడా సంస్కృతి కారణంగా అహ్మదాబాద్ను ఆదర్శ వేదికగా పేర్కొంది. ‘ఆసక్తి వ్యక్తీకరణ’ సమర్పించిన తర్వాత భారత ఒలింపిక్ సంఘం ఈ విషయాన్ని వెల్లడించింది. కామన్వెల్త్ గేమ్స్ 2030 కోసం బిడ్ సమర్పించడానికి యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రతిపాదనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని పీఎంఓ వెల్లడించింది.
బిడ్ ఆమోదించబడితే, సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అధికారుల నుండి అవసరమైన హామీలతో పాటు హోస్ట్ సహకార ఒప్పందం పై సంతకం చేయడానికి, గుజరాత్ ప్రభుత్వానికి అవసరమైన గ్రాంట్-ఇన్-ఎయిడ్ను మంజూరు చేయడానికి కూడా ఇది ఆమోదం తెలిపింది. ఇదిలా ఉండగా భారతదేశం చివరిసారిగా 2010లో కామన్ వెల్త్ గేమ్స్ కోసం ఆతిథ్యం ఇచ్చింది.
Also Read : Rapper Vedan Shocking : రేప్ కేసులో రాపర్ వేదన్ కు భారీ ఊరట

















