BCCI : ఢిల్లీ : అత్యంత ప్రతిష్టాత్మకమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్ష పదవికి ఎవరు ఎంపికవుతారనే దానిపై ఉత్కంఠకు తెర పడింది. తదుపరి బీసీసీఐ (BCCI) చీఫ్ గా ఢిల్లీకి చెందిన మిథున్ మన్హాస్ కొలువు తీరనున్నారు. ఇప్పటి వరకు అధ్యక్షుడిగా ఉన్న రోజర్ బిన్నీ ఉన్నట్టుండి గత ఆగస్టు నెలలో తన పదవికి రాజీనామా చేశారు. దీంతో తాత్కాలిక బీసీసీఐ చీఫ్ గా ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా వ్యవహరించారు. ఇదిలా ఉండగా ఆదివారం మిథున్ మన్హాస్ బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా బోర్డు పదవులకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళే చివరి తేదీ. ఈ పదవికి తను ఒక్కడే నామినేషన్ వేయడం గమనార్హం.
BCCI New Chief
మరో మాజీ క్రికెటర్ కూడా బోర్డు అగ్రశ్రేణిలో చేరే అవకాశం ఉంది, భారత మాజీ స్పిన్నర్ రఘురామ్ భట్ కోశాధికారిగా నియమితులయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. భట్ ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్కు నాయకత్వం వహిస్తున్నాడు. వచ్చే నెలలో 46 ఏళ్లు నిండనున్న మన్హాస్, క్రికెట్ పరిపాలనలో సన్నిహితంగా పాల్గొన్నాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ను పర్యవేక్షించే బీసీసీఐ నియమించిన సబ్-కమిటీలో అతను భాగంగా ఉన్నాడు. జమ్మూలో జన్మించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) జట్లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్తో సహా అనేక కోచింగ్ పాత్రల్లో పనిచేశాడు. బంగ్లాదేశ్ అండర్ -19తో బ్యాటింగ్ కన్సల్టెంట్గా కూడా పనిచేశాడు.
Also Read : Sunil Gavaskar Interesting Comments on Sanju : సంజూ శాంసన్ టైమింగ్ అద్భుతం : సన్నీ



















