Minister Anam Shocking Comments on Kasibugga : కాశీబుగ్గ ఘ‌ట‌న‌తో స‌ర్కార్ కు సంబంధం లేదు

స్ప‌ష్టం చేసిన దేవాదాయ శాఖ మంత్రి ఆనం

Hello Telugu - Minister Anam Shocking Comments on Kasibugga

Hello Telugu - Minister Anam Shocking Comments on Kasibugga

Minister Anam : అమ‌రావ‌తి : శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ‌నివారం జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam) తీవ్రంగా ఖండించారు కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉందన్నారు. ఈ గుడితో దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు.ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్ప‌ష్టం చేశారు ఆనం రామ నారాయ‌ణ రెడ్డి. ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని అన్నారు.

Minister Anam Ramanarayana Reddy Shocking Comments on Kasibugga Stampede Incident

ఇదిలా ఉండ‌గా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచి వేసిందన్నారు రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాన‌ని అన్నారు. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారుల‌ను ఆదేశించామ‌న్నారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశా నిర్దేశం చేసిందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుదంద‌న్నారు. ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడతామన్నారు.

Also Read : Minister Kandula Durgesh Interesting : సీఎం అభినంద‌న బాధ్య‌త‌ను పెంచింది

Exit mobile version