Minister Anam : నెల్లూరు జిల్లా చేజర్లలో గురువారం నిర్వహించిన ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.
Minister Anam Ramanarayana Reddy- సంక్షేమం – అర్హులందరికీ
“కుల, మతాలకు సంబంధం లేకుండా ప్రతి అర్హునికీ మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందజేస్తోంది,” అని మంత్రి ఆనం స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ల్యాండ్ టైటిల్స్ యాక్ట్ రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే, సూపర్ 6 హామీలను దశలవారీగా అమలు చేస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు.
ఇప్పటికే అమలైన పథకాలు:
ఎన్టీఆర్ పెన్షన్లు
దీపం గ్యాస్ పథకం
తల్లికి వందనం
రైతుల కోసం:
ఈ నెలలో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibava) నిధులు రైతుల ఖాతాల్లో జమ చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయం పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని స్పష్టం చేశారు.
మహిళలకు ప్రయాణం ఉచితం:
ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతుందని మంత్రి ప్రకటించారు. త్వరలో ఆడబిడ్డ నిధి పథకంను కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు.
కొత్త పెన్షన్ల ప్రకటన:
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో 80,000 కొత్త పెన్షన్లను మంజూరు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. గడచిన ప్రభుత్వ పాలనలో బాధితులుగా మిగిలినవారికి న్యాయం చేస్తామన్నారు.
అభివృద్ధి పనులు:
చేజర్ల గ్రామంలో రూ.1.20 కోట్లు వ్యయంతో కొలను అభివృద్ధి
సంగం బ్యారేజీపై రూ.73 కోట్లతో రోడ్ నిర్మాణం – ఇది ముంబై హైవేకి కనెక్ట్ అవుతుందని తెలిపారు
చేజర్ల చెన్నకేశవ స్వామి ఆలయాన్ని రూ.2 కోట్లతో పునఃనిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం
గత ప్రభుత్వంపై విమర్శలు:
మునుపటి వైసీపీ ప్రభుత్వం సంకేతాత్మక పనులు చేసి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. సంగం బ్యారేజీ పనులను కట్ అండ్ పేస్ట్ తరహాలో చేశారని విమర్శించారు.
Also Read : Air India Shocking Again : మధ్యలో ఆగిపోయిన ఢిల్లీ – వాషింగ్టన్ డీసీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం


















