Karnataka : కర్ణాటక – రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ) రవాణా సమ్మెకు దిగింది. దీంతో బస్సులు ఎక్కడికక్కడ ఆగి పోయాయి. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వివిధ ప్రాంతాలలోని బస్ స్టేషన్ లలో నిలిచి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న రోడ్డు రవాణా సంస్థల ఉద్యోగులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బకాయిలను చెల్లించాలని, జీతాల సవరణను డిమాండ్ చేస్తూ ఇవాళ నిరవధిక రాష్ట్ర వ్యాప్త సమ్మెను ప్రారంభించారు కార్మికులు. కర్ణాటకలో (Karnataka) విస్తృతంగా దీంతో అంతరాయం ఏర్పడింది. ఈ సమ్మె కారణంగా వేలాది బస్సులు రోడ్లపైకి రాలేదు. కాగా ప్రయాణికులు చిక్కుకు పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్ స్టేషన్లు రద్దీగా, అస్తవ్యస్తంగా మారాయి.
Karnataka Transport Blocked
KSRTC, BMTC, NWKRTC, KKRTC ఉద్యోగుల సంఘాల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. 38 నెలల జీతాల బకాయిల చెల్లింపు ,జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చే సవరించిన పే స్కేల్ అమలు చేయడం ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. అనేక నగరాల్లో బస్సు సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి: రాయచూర్లో, బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచి పోయాయి, రోజువారీ ప్రయాణికులు ఇబ్బందుల్లో పడ్డారు. ధార్వాడ్లో, సిటీ బస్సు కార్యకలాపాలు పూర్తిగా నిలిపి వేయబడ్డాయి. అయితే, హుబ్బళ్లి, ధార్వాడ్ మధ్య BRTS బస్సులు నడపడం కొనసాగించాయి, అయినప్పటికీ రెండు నగరాల్లో దాదాపు 100 బస్సులు మాత్రమే పనిచేస్తున్నాయి .
బెంగళూరు విమానాశ్రయానికి BMTC , KSRTC సేవలు ప్రభావితం కానప్పటికీ, నగరంలోని మిగిలిన ప్రాంతాలు మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని చూశాయి, నివాసితులు ఉపశమనం కోసం రైళ్ల వైపు మొగ్గు చూపారు. బెంగళూరులోని మెజెస్టిక్, రాయచూర్ బస్ స్టాండ్ మరియు ధార్వాడ్ సెంట్రల్ బస్ డిపోతో సహా కర్ణాటక అంతటా బస్టాండ్లు క్రిక్కిరిసి పోయాయి. ప్రతిష్టంభనను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ప్రయాణికులు తమ నిరాశను వ్యక్తం చేశారు.
Also Read : Kaleshwaram Commission Shocking : అక్రమాలు నిజం అవినీతి వాస్తవం
