రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా..?

దీక్ష విర‌మించిన క‌ల్వ‌కుంట్ల క‌విత

hellotelugu-MLCKavitha

హైద‌రాబాద్ : రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌ని అన్నారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వెలుగుమట్ల లో జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రజలంతా బాధగా ఉన్నారని అన్నారు. అర్థరాత్రి పూట బుల్డోజర్లతో పేదల ఇళ్లు కూల్చేయ‌డం దారుణ‌మ‌న్నారు. బాధితులను అవహేళన చేస్తూ వారికి భూమి మీద హక్కులు లేవంటూ మాట్లాడారని వాప‌యారు. సంఘటన తర్వాత చాలా పార్టీలు టూరిస్టుల మాదిరిగా బాధితుల వద్దకు వెళ్లారని పేర్కొన్నారు క‌విత‌. కానీ వారి సమస్య పరిష్కారమయ్యే విధంగా పెద్ద ఎత్తున పోరాటం చేయలేదన్నారు. అన్ని అర్హతలు ఉన్న వారి ఇళ్లు కూలగొట్టే అధికారం అసలు ఈ ప్రభుత్వానికి ఎక్కడిదని నిల‌దీశారు.

పేదల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న వైఖరేంటో తెలిపే సంఘటన ఇది అన్నారు. ఇలాంటి సంఘటనపై ఎలాంటి పోరాటం చేయాలన్న దానిపై విశారదన్ మహారాజ్ తో మాట్లాడానని చెప్పారు క‌విత‌. అన్ని పార్టీల మాదిరిగా కాకుండా సమస్యకు పరిష్కారం కోసం కార్యాచరణ చేయాలని భావించాం అన్నారు. ఆ క్రమంలో 9 వ తారీఖు రోజున ఖమ్మంలోని బాధితుల వద్దకు వెళ్లామ‌న్నారు . అక్కడ పరిస్థితులను చూస్తే అసలు మనం ఇండియాలో ఉన్నామా లేక అప్ఘనిస్తాన్ లో ఉన్నమా అనే అనుమానం కలిగిందన్నారు. పేదలను కొట్టి కొంతమంది పెద్దవాళ్లకు ఆ భూమి అప్పగించే కుట్ర చేస్తున్నారని మాకు అర్థమైందన్నారు.

Exit mobile version