న్యూఢిల్లీ : ఈ దేశం గర్వించేలా ఈ ఏడాదిలో అద్భుతమైన ఫలితాలు సాధించారంటూ మహిళా క్రీడాకారులను ఉద్దేశించి ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. ప్రతి నెలా ప్రధాన అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సందర్బంగా జరిగిన మన్ కీ బాత్ 129వ ఎడిషన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. 2025 జాతీయ గౌరవంతో, ఆపరేషన్ సింధూర్ , వందేమాతరం 150వ వార్షికోత్సవం ద్వారా భద్రతను బలోపేతం చేసిందని అన్నారు. పురుషుల క్రికెట్ జట్టు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచు కోవడం, మహిళల జట్టు మొదటిసారి ప్రపంచ కప్ను గెలుచు కోవడం, మహిళల అంధుల జట్టు T20 ప్రపంచ కప్ను కైవసం చేసుకోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వారిని ప్రశంసలతో ముంచెత్తారు.
అంతే కాకుండా యావత్ భారతం తల ఎత్తుకునేలా చేశారంటూ పారా-అథ్లెట్ల గురించి అన్నారు. బహుళ ప్రపంచ ఛాంపియన్షిప్ పతకాలను గెలుచు కోవడం వంటి ప్రధాన క్రీడా విజయాలు తనను మరింత సంతోషానికి గురి చేశాయని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న మొదటి భారతీయురాలిగా శుభాన్షు శుక్లా గురించి కూడా ప్రస్తావించారు. ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి రామాలయం జెండా ఎగుర వేయడం కూడా తనకు సంతృప్తి కలిగించిందని అన్నారు. జాతీయ ఆత్మ విశ్వాసాన్ని పెంచే స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ పెరగడం కూడా సంతోషం కలిగించిందని చెప్పారు.

















