India Strong Suppport to Afghanistan : ఆఫ్గ‌నిస్తాన్ కు భార‌త దేశం స‌హాయం

21 ట‌న్నుల మేర సామాగ్రి పంపిణీ

Hello Telugu - India Strong Suppport to Afghanistan

Hello Telugu - India Strong Suppport to Afghanistan

India : న్యూఢిల్లీ – భారీ భూకంపాల తాకిడికి ఆఫ్గ‌నిస్తాన్ త‌ల్ల‌డిల్లుతోంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ 21 టన్నుల భూకంప సహాయాన్ని పంపింది . గ‌త‌ ఆదివారం ఆలస్యంగా 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ఆఫ్ఘనిస్తాన్‌లో 1,400 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. భూకంప బాధిత ఆఫ్ఘనిస్తాన్‌కు భారత సహాయం కాబూల్‌కు చేరుకున్న తర్వాత విమానాల నుండి దించారు. ఆ దేశంలోని భూకంప బాధిత ప్రజలకు సహాయం చేయడంలో భాగంగా భారతదేశం (India) 21 టన్నుల సహాయ సామగ్రిని ఆఫ్ఘనిస్తాన్‌కు పంపిణీ చేసింది.

India Supprot to Afghanistan

ఊహించ‌ని భూ కంపం దెబ్బ‌కు ఆఫ్గ‌నిస్తాన్ అల్ల‌డిల్లి పోయింది. 6.0 తీవ్రతతో సంభవించిన భూకంపం తరువాత ప‌లువురు ప్రాణాలు కోల్పోగా పెద్ద ఎత్తున తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. భారత భూకంప సహాయం విమానం ద్వారా కాబూల్‌కు చేరుకుంటుంది అని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. అల్ల‌క‌ల్లోలంగా మారిన ఆఫ్గ‌నిస్తాన్ కు దుప్పట్లు, టెంట్లు, పరిశుభ్రత కిట్లు, నీటి నిల్వ ట్యాంకులు, జనరేటర్లు, వంటగది పాత్రలు, పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్లు, స్లీపింగ్ బ్యాగులు, అవసరమైన మందులు, వీల్‌చైర్లు, హ్యాండ్ శానిటైజర్లు, నీటి శుద్ధీకరణ మాత్రలు , వైద్య వినియోగ వస్తువులు వంటి ఇరవై ఒక్క టన్నుల సహాయ సామగ్రిని పంపినట్లు ఆయన చెప్పారు.

భారతదేశం భూ పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరింత మానవతా సహాయం పంపుతుంద‌ని విదేశాంగ మంత్రి తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం బారిన పడిన వారికి సాధ్యమైన రీతిలో సాయం చేసేందుకు భార‌త దేశం సిద్దంగా ఉంద‌ని స్ప‌ష్టం చేశారు ప్ర‌ధాని మోదీ.

Also Read : Appeals Court Shocking Trump : ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్

Exit mobile version