India Thrashes China Sensational : ఆసియా క‌ప్ హాకీ ఫైన‌ల్ లో భార‌త్

చైనాను 7 -0 తేడాతో ఓడించిన జ‌ట్టు

Hello Telugu - India Thrashes China Sensational

Hello Telugu - India Thrashes China Sensational

India : భార‌త హాకీ జ‌ట్టు ఆసియా క‌ప్ హాకీ ఫైన‌ల్ కు చేరుకుంది. చైనా జ‌ట్టును 7-0 తేడాతో ఓడించింది టీమిండియా. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో ఈ కీల‌క మ్యాచ్ జ‌రిగింది. ఆట ప్రారంభం నుండి ముగింపు వరకు భారత (India) జట్టు ఆధిపత్యం చెలాయించింది . శిలానంద్ లక్రా ఆట జ‌రిగిన 4వ నిమిషంలో మ‌రో ఆట‌గాడు దిల్‌ప్రీత్ సింగ్ 7వ నిమిషంలో , మ‌న్దీప్ సింగ్ 18వ నిమిషంలో , రాజ్ కుమార్ పాల్ 37వ నిమిషంలో గోల్స్ చేశారు. చైనా జ‌ట్టుకు చుక్క‌లు చూపించారు. ఇదే స‌మ‌యంలో ఆట 39వ నిమిషంలో సుఖ్ జీత్ సింగ్ , అభిషేక్ 46వ నిమిషంలో, 50వ నిమిషంలో గోల్స్ సాధించారు. అయితే జ‌ట్టు ప‌రంగా అభిషేక్ ఒక్క‌డే అద్భుత‌మైన రెండు గోల్స్ చేయ‌డం విశేషం. ఆట ఆరంభం నుంచి అయి పోయే దాకా భార‌త హాకీ జ‌ట్టు పూర్తి ఆధిప‌త్యాన్ని కొన‌సాగించింది.

India Thrashes China Hockey Team

ఇదిలా ఉండ‌గా భార‌త జ‌ట్టు సూపర్ 4లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కొరియా కంటే ఏడు పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. నాలుగు పాయింట్లతో రెండవ స్థానంలో ఉంది. ఆసియా కప్‌లో ఘర్షణ చెలరేగిన తర్వాత జరిగిన తొలి భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ప్రకటన వచ్చే ఏడాది బెల్జియం , నెదర్లాండ్స్ సంయుక్తంగా నిర్వహించనున్న ప్రపంచ కప్‌లో స్థానం కోసం ఇవాళ‌ జరిగే ఫైనల్‌లో భారత్ ఐదుసార్లు ఛాంపియన్స్ గా నిలిచిన కొరియాతో తలపడనుంది. ఇదిలా ఉండ‌గా మూడ‌వ‌, నాల్గవ స్థానం కోసం జరిగే మ్యాచ్‌లో చైనా, మలేషియా తలపడనున్నాయి. తప్పనిసరిగా గెలవాల్సిన సూపర్ 4 మ్యాచ్‌లో మలేషియాపై 4-3 తేడాతో విజయం సాధించడానికి కొరియా ఇంతకు ముందు ఉత్సాహభరితమైన ప్రదర్శన ఇచ్చింది.

Also Read : IMD – AP Huge Rains : అల్ప‌పీడ‌నం ఏపీ జ‌ర భ‌ద్రం : ఐంఎండీ

Exit mobile version