సీషెల్స్ : భారత దేశ ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. టూర్ లో భాగంగా ఆయన సీషెల్స్ దేశాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా జరగిన సీషెల్స్ జాతీయ దినోత్సవ వేడుకల్లో గౌరవ అతిథిగా పాల్గొన్నారు ప్రధాని మోదీ. తన అధికారిక పర్యటనలో భాగంగా, ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో అధికారిక చర్చలు జరిపారు. సీషెల్స్ స్వాతంత్ర్యం పొంది 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన జాతీయ దినోత్సవ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ‘గౌరవ అతిథి’గా పాల్గొన్నారు; ఈ గౌరవాన్ని పొందిన మొదటి భారతీయ ప్రధానమంత్రిగా ఆయన నిలిచారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ పరేడ్లో భారత నావికాదళం , సైనిక దళాల బృందాలతో కూడిన భారతీయ కవాతు బృందం పాల్గొంది.
భారత , సీషెల్స్ దేశాల మధ్య ఉన్న సన్నిహిత , ప్రత్యేక భాగస్వామ్యాన్ని చాటిచెప్పేలా, ఈ కవాతు బృందంతో పాటు భారత నావికాదళ బ్యాండ్ కూడా పాల్గొంది. ఒక ప్రత్యేక చర్యగా, ఆ ద్వీప దేశంతో భారత్కు ఉన్న దీర్ఘకాలిక స్నేహానికి చిహ్నంగా ఐఎన్ఎస్ తర్కష్ , ఇక్షక్ నౌకలు పోర్ట్ విక్టోరియాలో లంగరు వేయబడ్డాయి. ఈ చారిత్రాత్మక సందర్భంలో సీషెల్స్ ప్రజలకు ప్రధాని మోదీ భారతదేశం తరపున శుభాకాంక్షలు తెలిపారు. తన పర్యటనలో, ప్రధాని మోదీ సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినీతో అధికారిక చర్చలు జరిపారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అంశాలను సమీక్షించారు.
















