హైదరాబాద్ : నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన చిత్రం హనుమాన్ అంశ్. భారతీయ సినీ చరిత్రలో అతి తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం రికార్డులను తిరగ రాసింది. కోట్ల వర్షం కురిపించేలా చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. తాజాగా దేశంలోని వివిధ భాషలలో హనుమాన్ అంశ్ రైట్స్ కోసం పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది. అయితే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో తీసుకునే ప్రయత్నం చేసింది. హనుమాన్ అంశ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారు కూడా.
కాగా ఉన్నట్టుండి భారీ విజయం సాధించిన హనుమాన్ అంశ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే ప్రణాళికలకు ఊహించని ఆటంకం ఏర్పడింది. ఈ చిత్ర తెలుగు వెర్షన్కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సమర్పకుడిగా వ్యవహరిస్తారని గతంలో ప్రకటించారు . ఈ చిత్రంతో తన పేరును జత చేయడం ద్వారా తెలుగు థియేట్రికల్ వసూళ్లలో వాటా పొందేలా కుదిరిన పంపిణీ ఒప్పందం ఆధారంగా ఈ ఏర్పాటు జరిగింది. అలాగే, తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేసే బాధ్యతను ‘మైత్రీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ చేపట్టాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 18న శుక్రవారం థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. ప్రచార కార్యక్రమాలకు కూడా ఏర్పాట్లు జరుగుతుండగా, టీజర్ విడుదలకు వేదికను కూడా ఖరారు చేశారు. అయితే, చివరి నిమిషంలో ఈ ప్రణాళికలు నిలిపివేయబడ్డాయి. సినిమా విడుదల , టీజర్ విడుదల కార్యక్రమాలు రెండూ రద్దు కావడంతో అభిమానులు, సినీ వర్గాలు ఆశ్చర్యానికి గురయ్యాయి. ప్రస్తుతానికి, ఈ అకస్మాత్తు రద్దుకు గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. సినిమా తెలుగు విడుదల ప్రణాళికలకు సంబంధించి అధికారిక ప్రకటన కోసం వేచి చూడాల్సి ఉంది.
