బెంగళూరు : కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. ఆయన ఫిఫా వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్ కోసం ఏకంగా ఫుట్ బాల్ అభిమానులకు తీపి కబురు చెప్పారు. అర్ధరాత్రి వరకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. అయితే ఫుట్బాల్ అభిమానులు సంయమనం పాటించాలని కర్ణాటక సీఎం పిలుపునిచ్చారు. యువత అభ్యర్థన మేరకు, అభిమానులు ఫైనల్ మ్యాచ్ను వీక్షించేందుకు వీలుగా హోటళ్లు , రెస్టారెంట్లు సాధారణ సమయాల కంటే ఎక్కువ సేపు తెరిచి ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ మాట్లాడారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ చూసేటప్పుడు ఫుట్బాల్ అభిమానులు సహనం, శాంతిని పాటించాలని కోరారు. మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు తెల్లవారుజామున 3:30 గంటల వరకు తెరిచి ఉంచడానికి ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చిందని ఆయన తెలిపారు.
యువత కోరిక మేరకు, అభిమానులు ఫైనల్ మ్యాచ్ను చూసేందుకు వీలుగా హోటళ్లు, రెస్టారెంట్లు సాధారణ పనివేళల తర్వాత కూడా పని చేయడానికి అనుమతి ఇచ్చినట్లు విధాన సౌధ వద్ద విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. పోలీసులు వివిధ ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎవరు గెలిచినా, యువత తమ సహనాన్ని కోల్పోకూడదు. వారు ఫుట్బాల్ మ్యాచ్ను ప్రశాంతంగా చూడాలి అని శివకుమార్ అన్నారు. రాష్ట్రంలో తలెత్తుతున్న కరువు పరిస్థితులపై సన్నద్ధతను కూడా ముఖ్యమంత్రి సమీక్షించారు; మంత్రులు, డిప్యూటీ కమిషనర్లు , పోలీసు సిబ్బంది నిరంతరం (అహర్నిశలు) పని చేయాలని ఆయన ఆదేశించారు. మంత్రులు, డిప్యూటీ కమిషనర్లు లేదా పోలీసులకు ఆదివారాలు లేదా సెలవు దినాలు ఉండవు అన్నారు.

















