బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పాజిటివ్

ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ కు కూడా

hellotelugu-PilotRohitReddy

హైద‌రాబాద్ : రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పుల క‌ల‌క‌లం చోటు చేసుకుంది. ఇందులో ప‌లువురు పేరు పొందిన పొలిటిక‌ల్ లీడ‌ర్లు ఉన్న‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఈగిల్ టీం ఎస్పీ గిరిధ‌ర్ వెల్ల‌డించారు. ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కాల్పుల‌కు ఉప‌యోగించిన‌ తుపాకి, బుల్లెట్ల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. ఇదే క్ర‌మంలో డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాద‌వ్ కు పాజిటివ్ తేలింద‌న్నారు.

ఈ ఘ‌ట‌న‌లో 11 మందిని మాదక ద్రవ్యాల వినియోగంపై ఇక్కడ సమీపంలోని మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో జరిగిన దాడిలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అదుపులోకి తీసుకున్న వారిలో ఒకరు పోలీసు బృందాన్ని గమనించి మూడు రౌండ్లు కాల్పులు జరిపారని పేర్కొన్నారు ఎస్పీ గిరిధ‌ర్. ఈ ఫామ్‌హౌస్ రోహిత్ రెడ్డికి చెందినదని పేర్కొన్నారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్ పార్టీ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం మేరకు, ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ (EAGLE) ఫోర్స్ , పోలీసు బృందం దానిపై దాడి చేశాయ‌న్నారు. ఈ పార్టీకి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, రాజకీయ వ్యక్తులు కూడా హాజరైనట్లు పోలీసు అధికారి తెలిపారు. పాల్గొన్న వారిలో ఒక మహిళ కూడా ఉందన్నారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంద‌న్నారు.

Exit mobile version