YS Jagan : అమరావతి – మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) సీఎం చంద్రాబు నాయుడును ఏకి పారేశారు. మోసానికి చిరునామా బాబు పాలన కొనసాగుతోందన్నారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇస్తూ మహిళలను మోసం చేస్తున్నారంటూ వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో బహుళ ఆంక్షలతో అమలు చేసిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతోందన్నారు. 16 కేటగిరీల ఆర్టీసీ బస్సులలో కేవలం ఐదు రకాలు మాత్రమే కవర్ చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులలో, 950 నాన్స్టాప్ సర్వీసులను మినహాయించారని ఎందుకంటూ ప్రశ్నించారు. నెరవేరని వాగ్దానాలతో, ముఖ్యంగా ఉచిత బస్సు ప్రయాణ పథకంతో మహిళలను మోసం చేశారని ఆరోపించారు. తన మోసాలతో సోదరీమణులు , కుమార్తెలను కూడా మోసం చేసాడని వాపోయాడు.
YS Jagan Slams CM Chandrababu
మహిళలకు పెద్ద ఎత్తున ప్రచారం చేసిన ఉచిత బస్సు ప్రయాణాన్ని పూర్తిగా అమలు చేయడంలో విఫలమయ్యాడని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్ రెడ్డి. చిన్న వాగ్దానాన్ని కూడా నీరు గార్చే ప్రయత్నం చేశాడన్నారు. ఈ పథకం పద్ధతిలో మాత్రమే అమలు చేయబడిందని జగన్ పేర్కొన్నారు.
అందరు మహిళలు ఉచితంగా ప్రయాణించ వచ్చని మీరు చెప్పారు, కానీ నేడు మీరు లెక్కలేనన్ని పరిమితులతో కొన్ని బస్సులకు మాత్రమే పరిమితం చేశారన్నారు. 11,256 బస్సులకు గాను 6,700 బస్సులలో మాత్రమే ఉచిత ప్రయాణం అనుమతించారని, దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. 1,560 ఎక్స్ప్రెస్ బస్సులలో కూడా, 950 నాన్-స్టాప్ సర్వీసులను మినహాయించారని, ఇది మోసం కాదా అని నిలదీశారు.
Also Read : Hero Vishal – Sai Dhansika Marriage : హీరోయిన్ సాయి ధన్సికతో విశాల్ నిశ్చితార్థం
