CM Revanth Reddy : హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ రేట్ల పెంపులో 20 శాతం కార్మికులకు ఇస్తేనే జీవో ఇస్తామని ప్రకటించారు. ఈ రేట్లు పెరిగితే నిర్మాతలకు డబ్బులు వస్తాయని, వారు లాభ పడతారని కానీ కార్మికులకు ఎలాంటి మేలు చేకూరదన్నారు. అందుకే వారికి కూడా ఇచ్చని లాభాల్లో కనీసం 20 శాతానికి తగ్గకుండా ఇవ్వాలని స్పష్టం చేశారు. ఇక నుంచి టికెట్ రేట్ల విషయంలో కచ్చితంగా ఉంటామన్నారు. సినిమా టికెట్ల పెంపును సినీ సంక్షేమానికి అనుసంధానించారు. యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో సినీ కార్మికుల సమావేశంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. సినీ పరిశ్రమ కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను ఆవిష్కరించారు. అధిక వసూళ్లు రాబట్టే చిత్రాల విజయంలో సాంకేతిక నిపుణులు, జూనియర్ ఆర్టిస్టులు, రోజువారీ వేతన కార్మికులు , నిర్మాతలు, ప్రధాన నటులకు మాత్రమే పరిమితం కాకుండా వాటా పొందేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
CM Revanth Reddy Key Comments
ఇదిలా ఉండగా జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఈ సమావేశం రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది, తెలుగు సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న 25,000 మంది ఓటర్లు ఉండటంతో. టికెట్ ధరల పెంపు వల్ల ప్రయోజనం పొందుతున్న సినిమాల నుండి వచ్చే అదనపు బాక్సాఫీస్ కలెక్షన్లలో 20 శాతం సినిమా కార్మికుల సంక్షేమ నిధికి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. నవంబర్లో సినీ కార్మికుల కోసం ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను ఖరారు చేస్తుందని కూడా చెప్పారు రేవంత్ రెడ్డి.
Also Read : Minister Subhash Interesting Update : పునరావాస చర్యలు చేపట్టాలి : సుభాష్



















