CM Chandrababu – Free Bus : ఉచిత బస్సు పథకం ఆద‌ర‌ణ అద్భుతం – సీఎం

ఒక్క రోజే 18 లక్షల మంది ఉచిత ప్రయాణాలు

Hello Telugu - CM Chandrababu - Free Bus

Hello Telugu - CM Chandrababu - Free Bus

CM Chandrababu : అమరావతి – ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణ పథకం స్త్రీశక్తికి అద్భుతమైన స్పందన కనిపిస్తోంది. రోజు రోజుకీ మహిళా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. ఒక్క రోజులోనే 18 లక్షల మందికి పైగా మహిళలు జీరో ఫేర్ టికెట్ తో ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. దీంతో వారికి రూ.7 కోట్లకు పైగా ఆదా అయ్యింది. పథకం ప్రవేశపెట్టిన నాలుగు రోజుల్లో 47 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోగా.. దాదాపు రూ.19 కోట్ల మేర వారికి ఆదా అయ్యింది. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు తీరుపై ఆర్టీసీ ఉన్నతాధికారులతో సచివాలయంలో సీఎం సమీక్షించారు.

CM Chandrababu Key Comments on Free Bus Service

ఘాట్ రూట్‌లలోని ఆర్టీసీ సర్వీసుల్లో స్త్రీ శక్తి పథకం అమలుకు ముఖ్యమంత్రి (CM Chandrababu) అంగీకారాన్ని తెలిపారు. ఈమేరకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణించే మహిళల గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్ జిరాక్సుతో పాటు మొబైల్ డిజిటల్ లాకర్లోని సాఫ్ట్ కాపీని కూడా అనుమతించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మరో వైపు రోజువారీ ప్రయాణంలో తమకు ఎంత మేర ఆదా అవుతుందన్న అంశాలను మహిళలు తమతో సంతోషంగా పంచుకుంటున్నట్టు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమ‌ల రావు సీఎంకు తెలిపారు.

స్త్రీశక్తి పథకం వర్తించే సర్వీసులను మహిళలు సులభంగా గుర్తించేలా బస్సు లోపలా బయటా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ ప‌థ‌కం వ‌ల్ల మ‌హిళ‌ల్లో మ‌రింత ఆత్మ విశ్వాసం పెరుగుతంద‌న్నారు.

Also Read : Telangana High Court Shocking : తెలంగాణ క‌బ‌డ్డీ సంఘానికి హైకోర్టు ఝ‌ల‌క్

Exit mobile version