BSC Agriculture : హైదరాబాద్ – తెలంగాణ బీఎస్సీ అగ్రికల్చర్ అడ్మిష్మిన్ల (BSC Agriculture) ప్రక్రియ ఈ ఏడాదికి సంబంధించి ప్రారంభం కానున్నాయి. ఇందుకు గాను ఆగస్టు 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు తొలి విడత కౌన్సెలింగ్ జరగనుందని తెలంగాణ (Telangana) ఉన్నత విద్యా మండలి వెల్లడించింది. ఈ కోర్సులలో అడ్మిషన్స్ కు గాను ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ విశ్వ విద్యాలయం, పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వ విద్యాలయం లలో వివిధ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులలో ప్రవేశానికి సంయుక్త కౌన్సెలింగ్ను నిర్వహిస్తాయి.
BSC Agriculture Admissions
రాజేంద్రనగర్లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రతిరోజూ ఉదయం 9:30 గంటల నుండి కౌన్సెలింగ్ నిర్వహించ బడుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు దరఖాస్తులను సమర్పించిన అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలతో పాటు కౌన్సెలింగ్కు హాజరు కావాలని తెలిపింది. వ్యవసాయ కార్మికుల పిల్లలకు ప్రత్యేక కోటా కల్పించనున్నట్లు ప్రకటించింది. బీఎస్సీ (వ్యవసాయం) , బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ) కార్యక్రమాలలో వ్యవసాయ కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ప్రత్యేక కోటాను ప్రారంభించింది. బీఎస్సీ (అగ్రికల్చర్) , బీఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సులలో 15 శాతం సీట్లు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు లేదా గురుకులాల్లో 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు కనీసం నాలుగు సంవత్సరాలు చదివిన వ్యవసాయ కార్మికుల పిల్లలకు రిజర్వ్ చేయ బడతాయని పేర్కొంది.
ప్రత్యేక కోటా కింద అర్హత పొందాలంటే, విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు ప్రభుత్వం జారీ చేసిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కార్డును కలిగి ఉండాలి. కౌన్సెలింగ్ సమయంలో ధృవీకరణ కోసం విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను కూడా సమర్పించాలని స్పష్టం చేసింది ఉన్నత విద్యా మండలి. పీజేటీఎస్ఏయూ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని కోరింది. మూడు విశ్వ విద్యాలయాల లోని వివిధ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ప్రోగ్రామ్లలో ప్రవేశానికి ఉమ్మడి కౌన్సెలింగ్ జరుగుతుంది. విద్యార్థులు కౌన్సెలింగ్లో పాల్గొనవచ్చు. వారి మెరిట్ , అనుకూలత ప్రకారం వారు కోరుకున్న ప్రోగ్రామ్లలో ప్రవేశం పొందవచ్చని స్పష్టం చేసింది.
Also Read : Minister Nara Lokesh Strong Focus : ఏపీలో డేటా సిటీ ఏర్పాటుకు సహకరించండి
















