Nayanthara : చెన్నై : తమిళనాడులో ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, నటి త్రిష కృష్ణన్ లను చంపి వేస్తామంటూ నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. విచారణ అనంతరం ఫేక్ బెదిరింపు గా తేల్చి వేశారు. బుధవారం మరో నటి నయనతారకు కూడా ఇలాంటి బాంబు బెదిరింపు వచ్చింది. తమిళనాడు అగ్ర నాయకులు, ప్రముఖులను ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు కుదిపేసిన కొన్ని రోజుల తర్వాత చెన్నైలోని నటి నయనతార (Nayanthara) ఇంటిపై కూడా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. నటి త్రిష, స్వర్ణ మాల్యా, స్టాలిన్ ల తర్వాత నటి నయనతార కూడా చేరడం గమనార్హం.
Nayanthara Gets Bomb Threats
అల్వార్పేట వీనస్ కాలనీలో ఉన్న నయనతార విలాసవంతమైన ఇంట్లో బాంబు అమర్చినట్లు ఒక కాల్ వచ్చింది. వేగంగా చర్య తీసుకున్నారు తేనాంపేట పోలీసులు. బాంబు నిర్వీర్య బృందం, స్నిఫర్ డాగ్ స్క్వాడ్తో కలిసి ఆ ప్రాంగణంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ శోధనలో ఆ బెదిరింపు తప్పుడు హెచ్చరిక అని నిర్ధారించారు. నయనతార నివాసం ప్రస్తుతం ఖాళీగా ఉందని అధికారులు గుర్తించారు. ఎందుకంటే నటి సినిమా షూటింగ్ కోసం విదేశాలలో ఉంది. భద్రతా సిబ్బంది మాత్రమే ఆ ప్రదేశంలో ఉన్నారు. గత కొన్ని నెలలుగా, పాఠశాలలు, ప్రభుత్వ భవనాలు, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, గవర్నర్తో సహా ఉన్నత స్థాయి వ్యక్తుల నివాసాలపై తప్పుడు బాంబు హెచ్చరికలు నమోదయ్యాయి.
Also Read : KTR Strong Demand : సంక్షేమ పాఠశాలల భవనాల అద్దెలు చెల్లించాలి

















