హైదరాబాద్ : తెలంగాణలో వాణిజ్య బ్యాంకింగ్పై యాక్సిస్ బ్యాంక్ ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు.
హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో బ్యాంక్ ఉన్నతాధికారులు మాట్లాడారు. రిటైల్, సంపన్న వర్గాలు , కార్పొరేట్ బ్యాంకింగ్ విభాగాలలో తెలంగాణ తమకు కీలకమైన మార్కెట్గా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఇంజనీరింగ్ సేవలు, లాజిస్టిక్స్ మరియు సాంకేతిక ఆధారిత వ్యాపారాల నుండి బలమైన రుణ డిమాండ్ ఉన్నందున, తెలంగాణలోని ఎంఎస్ఎంఈ, వాణిజ్య బ్యాంకింగ్ రంగాలతో తమకున్న సంబంధాన్ని మరింత విస్తరిస్తున్నట్లు యాక్సిస్ బ్యాంక్ గురువారం వెల్లడించింది. అంతర్జాతీయ సంకేతాలు, ఎఫ్పీఐల కొనుగోళ్ల కారణంగా మార్కెట్ పుంజుకుందని తెలిపారు.
మార్చి 2026 నాటికి దాని మొత్తం రుణ పోర్ట్ఫోలియోలో 23.8 శాతం వాటాతో, స్మాల్ బిజినెస్ బ్యాంకింగ్ ఎస్బీఈ, మిడ్-కార్పొరేట్ విభాగాల ఉమ్మడి పోర్ట్ఫోలియో విలువ రూ. 2.93 లక్షల కోట్లుగా నమోదైంది. మిడ్-కార్పొరేట్ విభాగాలు వరుసగా 17 శాతం, 24 శాతం 33 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుతం తెలంగాణలో 24,000కు పైగా ఎంఎస్ఎంఈ ఖాతాలకు సేవలు అందిస్తోంది; వాణిజ్య బ్యాంకింగ్ , పర్యావరణ వ్యవస్థ ఆధారిత ఆర్థిక సేవల కార్యక్రమాలకు హైదరాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, వరంగల్ , ఖమ్మం ప్రాంతాలు కీలక మార్కెట్లుగా ఎదుగుతున్నాయి. మహమ్మారి తర్వాత కూడా ఈ-గ్రోసరీ రంగం అదే వేగంతో వృద్ధి చెందుతోంది. తెలంగాణలోని 30 జిల్లాల్లో తమకు 199 శాఖలు ఉన్నాయని, రాష్ట్రంలో 2,800 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారని బ్యాంక్ తెలిపింది.
















