హైదరాబాద్ : విమానాల హైజాక్ నుంచి ఎలా రక్షించాలనే దానిపై విస్తృతమైన అవగాహన కల్పించారు రాష్ట్ర హోం శాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్. ఇవాళ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (ఆర్జీఐఏ) ప్రాంగణంలోని ఏరో డ్రోమ్ భద్రతా కమిటీ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు సీవీ ఆనంద్. ఈ కమిటీ హైజాకింగ్ వ్యతిరేక విధానాలు, చర్యలకు సంబంధించి కీలక సూచనలు చేశారు. అప్రమత్తత అనేది ముఖ్యమన్నారు సీవీ ఆనంద్. ఈ కమిటీ ప్రత్యేకించి విమానయాన భద్రతా సంసిద్ధతను పరిశీలిస్తుంది. హోం కార్యదర్శి దీనికి చైర్మన్ గా ఉంటారని తెలిపారు. తనతో పాటు సైబరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ , ఐఎస్ డబ్ల్యూ, ఎన్ఎస్జీ, ఆక్టోపస్ , ఐబీ, బీసీఏఎస్, ఎయిర్ ఫోర్స్, రెవిన్యూ, సీఐఎస్ఎఫ్, ఫైర్ సర్వీసెస్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్ జీఎంఆర్, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ తో పాటు స్థానిక విభాగాలకు చెందిన ఇంఛార్జ్ లు సభ్యులుగా ఉన్నారని చెప్పారు సీవీ ఆనంద్.
విమానం హైజాక్ చేస్తే ఏమి చేయాలి అనే దానిపై విస్తృతంగా చర్చించారు. గత సమావేశం సమ్మతులను చర్చించి, విశ్వ విద్యాలయాలు, మనస్తత్వవేత్తల నుండి సంధానకర్తలను గుర్తించడంలో చురుగ్గా ఉండాలని సూచించారు. హైజాకర్లను ఎదుర్కోవడానికి వారికి శిక్షణ ఇవ్వాలని, అన్ని వాటాదారుల కదలికల మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించడానికి, విమానాశ్రయ ఐసోలేషన్ బేలో, రన్వేపై మాక్ డ్రిల్స్ నిర్వహించడానికి, మరిన్ని సీసీటీవీలు , ఇతర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సమావేశం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా సీఐఎస్ఎఫ్ లోని విమానాశ్రయ రంగంలో ఐజీగా తన అనుభవాలను గుర్తు చేశారు. నకిలీ బాంబు బెదిరింపులు, విమానాల రద్దు, భద్రతా అంశాలను అది ఎలా ప్రభావితం చేస్తుందో హైలెట్ చేశారు సీవీ ఆనంద్.
