AP Growth – Swachh Survekshan Award : ఏపీకి 2024-25 కి సంబంధించి 5 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు

దేశవ్యాప్తంగా పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా నగరాలను వర్గీకరించే..

Hello Telugu - AP Growth - Swachh Survekshan Award

Hello Telugu - AP Growth - Swachh Survekshan Award

Swachh Survekshan : కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–25 సర్వే ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా పరిశుభ్రత ప్రమాణాల ఆధారంగా నగరాలను వర్గీకరించే ఈ ప్రతిష్టాత్మక సర్వేలో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం వరుసగా ఎనిమిదోసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

Swachh Survekshan Awards for AP

ఇప్పటివరకు వచ్చిన తొమ్మిది ఎడిషన్లలో ఇండోర్ ఎనిమిదింట్లో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. రెండో స్థానంలో గుజరాత్‌లోని సూరత్, మూడవ స్థానంలో మహారాష్ట్రకు చెందిన నవీ ముంబై నిలిచాయి.

ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు

స్వచ్ఛ సర్వేక్షణ్ (Swachh Survekshan) అవార్డుల కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఐదు నగరాలు అవార్డులు గెలుచుకోవడం విశేషం. విజయవాడ, తిరుపతి, గుంటూరు, గ్రేటర్ విశాఖపట్నం (జీవీఎంసీ), రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లు వివిధ విభాగాల్లో పురస్కారాలు అందుకున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ అవార్డులను స్వీకరించారు.

ఈ సందర్భంగా మంత్రి నారాయణ (Minister Narayana) మాట్లాడుతూ, “స్వచ్ఛ భారత్ మిషన్‌పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది,” అని పేర్కొన్నారు.

తెలంగాణకు గౌరవం

తెలంగాణ రాష్ట్రానికి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్, క్లీనెస్ట్ కంటోన్మెంట్ విభాగంలో దేశంలో మొదటి స్థానం దక్కించుకుంది. అలాగే హైదరాబాద్ నగరం, వ్యర్థాల రహిత నగరాల విభాగంలో 7 స్టార్ రేటింగ్ సాధించింది. గతేడాది 5 స్టార్ రేటింగ్‌లో ఉండగా, ఈ ఏడాది మెరుగైన ప్రదర్శనతో రేటింగ్‌ను పెంచుకుంది. “ప్రామిసింగ్ స్వచ్ఛ షహర్” జాబితాలోనూ హైదరాబాద్ స్థానం నిలబెట్టుకుంది.

విశేష అవార్డులు – విశ్లేషణ

ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో 4,500 కంటే ఎక్కువ నగరాలు పాల్గొన్నాయి. పరిశీలనకు 10 ప్రమాణాలు మరియు 54 సూచికలు ఆధారంగా మదింపు జరిపారు. 78 విభిన్న అవార్డులు నాలుగు ప్రధాన విభాగాల్లో ఇవ్వబడ్డాయి:

నోయిడా అగ్రగామిగా

3–10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో నోయిడా అగ్రస్థానం దక్కించుకుంది. అనంతరం చండీగఢ్ మరియు మైసూర్ నిలిచాయి. విజయవాడ కూడా ఈ జాబితాలో ప్రస్తావనకు వచ్చిన నగరాల్లో ఒకటిగా నిలిచి తెలుగు రాష్ట్రాల ప్రతిష్టను నిలబెట్టింది.

Also Read : పోల‌వ‌రంపై ఏపీ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం – ష‌ర్మిల

Exit mobile version