న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయూమర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏఐ న్యాయ పరమైన సమస్యలకు తార్కికంగా సమాధానం ఇవ్వగలదని, కానీ న్యాయపరమైన అంతరాత్మ స్థానాన్ని భర్తీ చేయలేదని అన్నారు. న్యాయ వ్యవస్థలో ఏఐ వినియోగాన్ని పర్యవేక్షించడానికి శాశ్వత అపెక్స్ బాడీని సూర్య కాంత్ ప్రతిపాదించారు. ఏఐ న్యాయ పరిశోధన, అనువాదం, కోర్టు పరిపాలనకు మద్దతు ఇవ్వగలదని, కానీ మానవ తీర్పును భర్తీ చేయకూడదని లేదా న్యాయపరమైన ఫలితాలను నిర్ధారించకూడదని అన్నారు. కృత్రిమ మేధస్సు న్యాయపరమైన తార్కికతను పెంచగలదని ఇదే సమయంలో తీర్పు ఇవ్వలేదన్నారు. ఈ కొత్త సాంకేతికత వినియోగం , జవాబుదారీతనాన్ని పర్యవేక్షించడానికి ఒక శాశ్వత అపెక్స్ బాడీని ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. జర్మనీలోని కార్ల్స్రూహేలో ఉన్న ఫెడరల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అధ్యక్ష న్యాయమూర్తి ఉల్రిచ్ హెర్మాన్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో మాట్లాడారు.
కృత్రిమ మేధస్సు , న్యాయ పరిశోధన, 16 భాషల్లోకి తీర్పుల అనువాదం, పౌరులు కేసు స్థితి, విధానాలను తెలుసు కోవడానికి ఒక సంభాషణాత్మక ఇంటర్ఫేస్గా వంటి కొన్ని నిర్దిష్ట సహాయక విధులలో ఉపయోగించ బడుతోందని అన్నారు జస్టిస్ సూర్యకాంత్ . సుప్రీంకోర్టు ఏఐ కమిటీ ముసాయిదా నిబంధనలు షెడ్యూలింగ్, ట్రాన్స్క్రిప్షన్ , అనువాదం వంటి పరిపాలనా పరమైన ఉపయోగాలను అనుమతిస్తాయని తెలిపారు సీజేఐ . అయితే సాక్షి విశ్వసనీయత, పలాయన ప్రమాదం, పునరావృత నేరాలు లేదా బెయిల్ అర్హతను అంచనా వేయకుండా ఏఐని నిషేధిస్తాయని పేర్కొన్నారు. ఏఐ స్వీకరణ , జవాబుదారీతనాన్ని పర్యవేక్షించడానికి ఒక శాశ్వత అపెక్స్ బాడీని ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు. సాంకేతికత , పరిపాలనా సంస్కరణలు ఈ బాధ్యతకు మద్దతు ఇవ్వగలవు, కానీ జాగ్రత్తతో కూడిన తీర్పు, మానవ విచక్షణ, చట్టానికి విశ్వసనీయతను ఏదీ భర్తీ చేయలేదని అన్నారు సీజేఐ సూర్యకాంత్.


















