బేగం ఖ‌లీదా జియాకు క‌న్నీటి వీడ్కోలు

జ‌న‌సంద్రమైన దేశ రాజ‌ధాని వీధులు

helotelugu_begumKhalidaZiaMuneral

బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ దేశ రాజ‌ధాని ఢాకా జ‌న‌సంద్ర‌మైంది. మాజీ అధ్య‌క్షురాలు బేగం ఖ‌లీదా జియా అంత్య‌క్రియ‌ల‌కు భారీ ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు స్వ‌చ్చంధంగా అశేష జ‌న స‌మూం. ఈ సంద‌ర్బంగా దివంగ‌త నాయ‌కురాలు త‌న‌యుడు రెహ‌మాన్ సామాజిక వేదిక ఎక్స్ ద్వారా త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు. ఆయ‌న ఈ విధంగా త‌మ ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. నిన్నటి తీవ్ర వ్యక్తిగత వియోగ క్షణాల్లో, నేను హృదయ పూర్వకంగా మాట్లాడాల‌ని అనుకుంటున్నాను. నా తల్లి అంతిమ వీడ్కోలు సమయంలో దేశం తనంతట తానుగా సాగడానికి సహాయ పడిన అనేక మంది వ్యక్తులకు, వారి శ్రద్ధ వృత్తి నైపుణ్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.

రోజంతా గౌరవంగా, శ్రద్ధగా నిలబడిన బంగ్లాదేశ్ ఆర్మీ, నేవీ, వైమానిక దళ అధికారులు, సిబ్బందికి నేను చాలా .రుణ‌ప‌డి ఉన్నాన‌ని తెలిపారు. మీలో చాలా మంది చాలా గంటలు విధుల్లో ఉన్నారని, మమ్మల్ని చుట్టుముట్టిన దుఃఖాన్ని గుర్తుంచుకుంటూ క్రమశిక్షణ, ప్రశాంతతను కాపాడుతున్నారు. మీ ప్రవర్తన క్రమశిక్షణను మాత్రమే కాకుండా, దయను కూడా ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. మా భద్రతా, చట్ట అమలు సేవలలో పనిచేస్తున్న పురుషులు, మహిళలకు కూడా నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. హోం అడ్వైజర్ కార్యాలయం, పోలీసులు, బీజీబీ, అన్సార్ అండ్ వీడీపీ , ఆర్ఏబీ, ఏపీబీఎన్ , త‌దిత‌రులంతా హాజ‌రు కావ‌డం ప‌ట్ల ధ‌న్య‌వాదాలు తెలిపారు రెహ‌మాన్. మా సరిహద్దులకు మించి నా తల్లి పట్ల ఉన్న లోతైన గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

Exit mobile version