Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి భూమి పైకి సురక్షితంగా చేరుకున్నారు భారత దేశానికి చెందిన వ్యోమగామి శుభాంషు శుక్లా. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శాన్ డియాగో తీర ప్రాంతంలో తను క్షేమంగా దిగాడు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. శుక్లా (Shubhanshu Shukla) భారత దేశానికి గర్వ కారణంగా నిలిచాడని ప్రశంసించారు. ఒక బిలియన్ కలలకు తను స్పూర్తిని కలిగించేలా చేశాడని పేర్కొన్నారు. గ్రూప్ కెప్టెన్ శుక్లా ఏడు భారతదేశ-నిర్దిష్ట మైక్రోగ్రావిటీ ప్రయోగాలను నిర్వహించాడు, అంతరిక్ష శాస్త్రం , సాంకేతికతలో భారతదేశానికి సంబంధించి పెరుగుతున్న సామర్థ్యాలను ప్రదర్శించాడు. కాగా గ్రూప్ కెప్టెన్ శుక్లా ఆగస్టు 17న ఢిల్లీకి తిరిగి వస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు.
Shubhanshu Shukla Reached Successfully
అంతరిక్ష నౌక భూమికి తిరిగి వచ్చిన తర్వాత. తను ప్రస్తుతం భారత వైమానిక దళ పైలట్ గా ఉన్నారు. 1984లో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షాన్ని సందర్శించిన రెండవ భారతీయుడిగా చరిత్ర సృష్టించారు. 150 బిలియన్ డాలర్ల విలువైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, కక్ష్యలో తిరుగుతున్న అంతరిక్ష ప్రయోగశాలను సందర్శించిన మొదటి భారతీయుడు కూడా ఆయనే కావడం విశేషం.
అంతరిక్షానికి తన చారిత్రాత్మక మిషన్ నుండి భూమికి తిరిగి వస్తున్న గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లాను స్వాగతించడంలో నేను దేశంతో చేరతాను. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన భారతదేశపు మొదటి వ్యోమగామిగా, ఆయన తన అంకితభావం, ధైర్యం, మార్గదర్శక స్ఫూర్తి ద్వారా బిలియన్ కలలను ప్రేరేపించారంటూ ప్రశంసలు కురిపించారు పీఎం. ఇది మన స్వంత మానవ అంతరిక్ష విమాన మిషన్ – గగన్యాన్ వైపు మరో మైలురాయిని సూచిస్తుందని పేర్కొన్నారు.
Also Read : Stock Market Interesting : చాలారోజులకి స్వల్ప లాభాలతో నడుస్తున్న స్టాక్ మార్కెట్

















