Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారులు, కబ్జాదారులకు చుక్కలు చూపెడుతోంది. ఈ సందర్బంగా ప్రతి సోమవారం హైడ్రా ప్రత్యేకంగా ప్రజా వాణి నిర్వహిస్తూ వస్తోంది. ఎద్ద ఎత్తున బాధితులు క్యూ కడుతున్నారు. ఫిర్యాదులు చేస్తున్నారు ధైర్యంగా. తమకు చెందిన స్థలాలతో పాటు ప్రభుత్వానికి చెందిన స్థలాలను కూడా ఆక్రమిస్తుండడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో సహా ప్రజావాణిలో దరఖాస్తులు చేస్తున్నారు. వీరి ఫిర్యాదులను దగ్గరుండి పరిశీలించి చర్యలకు ఆదేశిస్తున్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాజాగా రంగారెడ్డి జిల్లా లో సరూర్నగర్ మండలం కర్మన్ ఘాట్ గ్రామంలోని సాయి గణేశ్ నగర్లో పార్కును హైడ్రా (Hydraa) కాపాడింది.
Hydraa Saved Huge Land in Karman Ghat
1979లో మొత్తం 176 ప్లాట్లతో సాయి గణేష్ నగర్ లేఔట్ వేశారు. దాదాపు 450 గజాల స్థలాన్ని పార్కు కోసం కేటాయించారు. ఇటీవల కొంత మంది వ్యక్తులు ఈ పార్కు స్థలంపై కన్నేశారు. అనధికారికంగా గది నిర్మాణం చేపట్టారు. వారిని ప్రశ్నించిన కాలనీ వాసులను ఆక్రమణదారులు బెదిరించారు. కాలనీ నివాసితులు హైడ్రా కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన హైడ్రా అధికారులు వెళ్లి పరిశీలించారు. పార్కు స్థలంపై చిన్న గది, గోడ వంటి అక్రమ నిర్మాణాలు ఉన్నట్టు గుర్తించారు. సంబంధిత వ్యక్తులు సమర్పించిన పత్రాలను పరిశీలించగా, ఆ నిర్మాణం సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు కాలేదు. అంతే కాకుండా అది పూర్తిగా అక్రమ నిర్మాణం అని నిర్ధారించారు.హైడ్రా అధికారులు స్వయంగా ఆ అక్రమ గోడను తొలగించి, అక్రమ నిర్మాణాన్ని కూల్చి వేశారు. పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రాకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Harish Rao Shocking Comments on CM : కేటీఆర్ పై సీఎం కక్ష సాధింపు చర్యలు తగదు


















