Telangana Govt : హైదరాబాద్ : ఏపీలోని కర్నూలు జిల్లాలో తాజాగా జరిగిన బస్సు ఘటన దెబ్బకు తెలంగాణ సర్కార్ (Telangana Govt) మేలుకొంది. ఈ మేరకు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో తిరుగుతున్న ప్రైవేట్ బస్సులను తనిఖీ చేపట్టారు. ఆయా చెక్ పోస్టుల వద్ద చెకింగ్ చేశారు. వాటి ఫిట్ నెస్ ఉందా లేదా అన్నది చూశారు. ఇప్పటి వరకు 14 కేసులు నమోదు చేసినట్లు ప్రకటించారు మంత్రి .
ఇదిలా ఉండగా ప్రతి రోజు హైదరాబాద్ నుండి దాదాపు 500 అంతర్రాష్ట్ర ప్రైవేట్ ట్రావెల్ బస్సులు నడుస్తాయి. భారీ అంతర్రాష్ట్ర ట్రాఫిక్ మధ్య బస్సు ప్రమాదాలను నివారించడానికి చర్యలు రూపొందించడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అధికారులతో సమావేశమవుతానని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
Telangana Govt Shocking
వాహన ఫిట్నెస్ను నిర్వహించడంలో, చట్టబద్ధమైన నిబంధనలను పాటించడంలో విఫలమైతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లను ఆయన హెచ్చరించారు. భద్రత, ఫిట్నెస్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఆదివారం తెలంగాణలో రవాణా అధికారులు ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు కొనసాగించారని తెలిపారు. కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానా కూడా విధించడం జరిగిందన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. యజమానులు నియమాలను పాటించాలని, బస్సులు అతివేగంతో ప్రయాణించకుండా చూసుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కర్నూలు బస్సు దుర్ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 21 మంది బతికి బయట పడ్డారు.
Also Read : Minister Nadendla Manohar Interesting Update : తుపాను ప్రభావం నిత్యావసర వస్తువులు సిద్దం

















