Thalapathy Vijay : చెన్నై : టీవీకే పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు దళపతి విజయ్ శనివారం నుంచి మీట్ ది పీపుల్ పేరుతో జనాన్ని కలిసేందుకు శ్రీకారం చుట్టారు. తమిళనాడులోని తిరుచ్చి నుంచి ప్రారంభించారు. భారీ సభతో ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు మధురై వేదికగా జరిగిన భారీ సభలో. డిసెంబర్ 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచార సభలు చేపడతామని ప్రకటించారు. తిరుచ్చికి చేరుకున్న విజయ్ (Thalapathy Vijay) కు భారీ గా వెల్ కమ్ చెప్పారు పార్టీ నాయకులు, కార్యకర్తలు.
Thalapathy Vijay Meeting in Tiruchi
ఇదిలా ఉండగా విజయ్ కి ఇది తొలి రాజకీయ కార్యక్రమం కావడం విశేషం. వచ్చే శాసన సభ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. తమిళగా వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ తమిళనాడు అంతటా తన 98 రోజుల రాజకీయ పర్యటనను ప్రారంభించడం కలకలం రేపింది. తిరుచ్చిలోని మరక్కడైలోని గాంధీ మార్కెట్ పోలీస్ స్టేషన్లోని ఎంజీఆర్ విగ్రహం నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు దళపతి విజయ్. అర్హులకు పట్టాభిషేకం చేయడానికి తిరిగి వస్తుంది మీ విజయ్ వస్తున్నాడు అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు.
ఈ పర్యటన ఓటర్లతో నేరుగా కనెక్ట్ అయ్యేలా రూపొందించబడింది. తన కుటుంబం అని పిలిచే ప్రజలను కలవడానికి, వారి ఆందోళనలను విస్తృతం చేయడానికి ప్రతి జిల్లాకు ప్రయాణించాలనే తన ఉద్దేశ్యాన్ని విజయ్ పేర్కొన్నాడు. ఆయన తన టీవీకే పార్టీని ప్రజల నాడిని అర్థం చేసుకునే పార్టీగా మనస్సాక్షి ఆధారిత ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఘర్షణ తన కార్యక్రమంపై ఆంక్షలు విధించినందుకు తమిళనాడు ప్రభుత్వాన్ని విమర్శించారు.
Also Read : CM Chandrababu Sensational Comments : నా వల్లే హైదరాబాద్ లో భూముల ధరలు రెట్టింపు

















