Piyush Goyal : ఢిల్లీ : ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా ఉన్న నాలుగు స్లాబ్ రేట్లను రెండు స్లాబ్ లకే పరిమితం చేసింది. ఒకటి 5 శాతం కాగా రెండోది 18 శాతానికి ఖరారు చేసింది. ఈ సందర్బంగా తాజాగా తీసుకున్న అసాధారణ నిర్ణయం వల్ల పెద్ద ఎత్తున భారత దేశ ఆర్థిక వృద్దికి దోహద పడేలా చేస్తుందన్నారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal). శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారిగా దేశంలో చారిత్రాత్మక, సమగ్ర సంస్కరణలు జరిగాయని, ఇది దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని గోయల్ నొక్కి చెప్పారు. గణనీయమైన ఫలితాలను ఇవ్వగల చర్యలు తీసుకునే సామర్థ్యం భారతదేశానికి ఉందని ఆయన ఇంకా పేర్కొన్నారు.
Piyush Goyal Key Comments on GST
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పాలనలో, అవినీతికి పాల్పడటమే కాకుండా, వారు ఎటువంటి పరివర్తనాత్మక నిర్ణయాలు తీసు కోలేదన్నారు. వారు వాగ్దానాలు మాత్రమే చేశారే తప్పా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు గోయల్. జీఎస్టీ సంస్కరణలను సరళీకృత పన్నుగా అభివర్ణించారు, ఈ నిర్ణయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రశంసించారు. కాంగ్రెస్ పాలనలో విలువ ఆధారిత పన్ను , కేంద్ర పన్నుతో సహా బహుళ పన్నులు విధించారని, అయితే వ్యాపారాన్ని సులభతరం చేయడానికి పన్ను వ్యవస్థను సరళీకృతం చేయాలని ప్రధాని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు.
Also Read : GST 2.0 – Telangana Suffer : జీఎస్టీ 2.0లో తెలంగాణకు భారీ నష్టం
















