PM Modi : ఢిల్లీ – భారతదేశం త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (PM Modi) స్పష్టం చేశారు. ఎకనామిక్ టైమ్స్ వరల్డ్ లీడర్స్ ఫోరం లో పాల్గొని ప్రసంగించారు. సంస్కరణ, పనితీరు, పరివర్తన అనే మంత్రంతో మార్గనిర్దేశం చేయబడిన భారతదేశం ప్రపంచాన్ని నెమ్మదిగా వృద్ధి నుండి బయట పడేయడానికి సహాయపడే స్థితిలో ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారే మార్గంలో ఉందని ప్రధాని చెప్పారు. సంస్కరణ అనేది తన ప్రభుత్వానికి నిబద్ధత, దృఢ నిశ్చయంగా ఉందన్నారు. క్లీన్ ఎనర్జీ, క్వాంటం టెక్నాలజీ, బ్యాటరీ నిల్వ, అధునాతన పదార్థాలు, బయోటెక్నాలజీ వంటి రంగాలలో పరిశోధన, అభివృద్ధిలో పెట్టుబడులను పెంచాలని ప్రధానమంత్రి ప్రైవేట్ రంగాన్ని కోరారు.
PM Modi Interesting Update on India Growth
ఇది అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు నరేంద్ర మోదీ.
ఇప్పటికే సాధించిన దానితో సంతృప్తి చెందడం నా స్వభావం కానే కాదన్నారు. అదే విధానం మన సంస్కరణలను మార్గనిర్దేశం చేస్తుందన్నారు. ప్రభుత్వం సమగ్రమైన కొత్త సంస్కరణలను తీసుకు రాబోతోందని ప్రధానమంత్రి చెప్పారు. ప్రతిపక్ష పార్టీల అంతరాయాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇటీవల ముగిసిన పార్లమెంటు వర్షాకాల సమావేశంలో సంస్కరణలను కొనసాగించిందని ఆయన అన్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ అతి త్వరలో ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు మోదీ.
Also Read : CM Revanth Reddy Fired on KCR : బీసీ కోటా జాప్యానికి కేసీఆరే కారణం : సీఎం
















