CM Revanth Reddy : హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మరోసారి బీఆర్ఎస్ బాస్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ బిల్లు పై వాదనలు వినిపిస్తామని అన్నారు. ఇదే సమయంలో బీసీ కోటా జాప్యానికి గత పాలనే కారణమన మండిపడ్డారు. కేసీఆర్ పాలనా పరంగా ఆశించిన మేర చర్యలు తీసుకోక పోవడం వల్లే ఇవాళ ఖజానా ఖాళీగా మారిందన్నారు. తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy Slams KCR
రాష్ట్రపతి భవన్లో రెండు కీలకమైన 42 శాతం బీసీ కోటా బిల్లులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉండటంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు బలమైన వాదనలు సమర్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మార్చిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు వెనుకబడిన తరగతుల సమాజానికి 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్నాయని చెప్పారు. ఒకటి విద్య, ఉపాధిలో, మరొకటి స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్రపతి వద్ద ఆమోదం కోసం ఉన్నాయని వెల్లడించారు సీఎం.
ఇదిలా ఉండగా గాంధీ భవన్లో జరిగిన టిపిసిసి రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి), సలహా కమిటీ సంయుక్త సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. సుప్రీంకోర్టు ముందు తెలంగాణ కేసును వాదించడానికి ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు నిమగ్నమై ఉన్నారని అన్నారు. రాష్ట్ర చట్టాన్ని ఆమోదించడానికి రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విషయంలో రాష్ట్రం విడిగా పిటిషన్ దాఖలు చేయదన్నారు. అయితే ఈ అంశంపై రాష్ట్రపతి సూచనపై సుప్రీంకోర్టులో విచారణ తిరిగి ప్రారంభమైనప్పుడు తన వాదనలను సమర్పిస్తుందని స్పష్టం చేశారు.
Also Read : Mamata Banerjee Poorest CM Sensational : అత్యంత పేద సీఎం మమతా బెనర్జీ
















