PM Modi : న్యూఢిల్లీ – భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ఎస్సీవో శిఖారగ్ర సమావేశానికి హాజరవుతారు. ప్రస్తుతం చైనా సరిహద్దులో శాంతి, ప్రశాంతత నెలకొని ఉందని, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత గణనీయమైనవి అని భారత దేశ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. రాబోయే షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) చైనాకు వెళతారని వెల్లడించారు. ఇదిలా ఉండగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మంగళవారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో తన చర్చల సందర్భంగా చెప్పారు. సరిహద్దు సమస్యపై ప్రత్యేక ప్రతినిధుల సంభాషణ కొనసాగిందన్నారు.
PM Modi Key Meeting
ప్రస్తుతం యావత్ ప్రపంచం ఉగ్రవాదం అనే ముప్పును ప్రత్యేకంగా ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. భారత దేశం ఎప్పుడూ సంయమనం పాటిస్తుందని, శాంతి కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై ఫోకస్ పెట్టాయన్నారు. ఇవాళ జరిపిన చర్చలు చాలా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించు కుంటాయని స్పష్టం చేశారు. ఆగస్టు 31 , సెప్టెంబర్ 1 తేదీలలో జరిగే శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి చైనా నగరమైన టియాంజిన్కు మోడీ పర్యటనకు ఇది మొదటి అధికారిక నిర్ధారణ అని పేర్కొన్నారు అజిత్ దోవల్. 2020లో ఘోరమైన గల్వాన్ వ్యాలీ ఘర్షణల తర్వాత తీవ్ర ఒత్తిడికి గురైన తర్వాత తమ సంబంధాన్ని పునర్నిర్మించడానికి రెండు పొరుగు దేశాలు చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా వాంగ్ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.
Also Read : Sudarshan Reddy-India Alliance Shocking : ఇండియా కూటమి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డి
















